ఇంటి ముందు ఆడుకుంటున్న బాలిక.. ఇంతలో అక్కడికొచ్చిన కామాంధుడు.. చివరికి?

praveen
నేటి ఆధునిక సమాజంలో ఆడపిల్లల భద్రత రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారిపోతుందా అంటే వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అవును అనే సమాధానమే చెబుతున్నారు. ఎందుకంటే సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులు కాదు మనుషులకంటే ఎక్కువగా కామంతో కళ్ళు మూసుకుపోయిన కామందులే ఉన్నారేమో అనే రీతిలో ఎన్నో దారుణమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే ఆడపిల్ల కళ్ళ ముందు కనిపించింది అంటే చాలు మగాళ్ళలో ఉన్న మృగాలు బయటికి వచ్చి చివరికి దారుణంగా వేధింపులకు పాల్పడుతున్నారు. ఇంట్లో ఉన్న.. చదువుకునేందుకు వెళ్లిన.. ఉద్యోగం చేస్తున్న.. వ్యాపారం చేస్తున్న ఎక్కడికి వెళ్లినా ఆడపిల్లలకు ఇలాంటి వేధింపులు తప్పడం లేదు.

 వెరసి ఇలాంటి ఘటనలతో ఆడపిల్ల ఇంటి నుంచి కాలు బయటపెట్టాలి అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. అయితే అభం శుభం తెలియని చిన్నారులపై జరుగుతున్న అత్యాచార ఘటనలు కూడా రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి అని చెప్పాలి. అత్యాచారం చేసిన కామాంధులను శిక్షించేందుకు కఠినమైన చట్టాలు తీసుకువచ్చిన ఎక్కడా మృగాల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఇటీవల హైదరాబాద్ నగరంలో కూడా మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆరవ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం చేశాడు ఒక నీచుడు.

 హైదరాబాద్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న షాపూర్ నగర్ లో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. ఇటీవల రాత్రి సమయంలో బాలిక ఇంటి ముందు సైకిల్ తొక్కుకుంటూ ఆడుకుంటూ ఉంది. ఈ క్రమంలోనే కామంతో ఊగిపోయిన గుజరాత్ కు చెందిన ఒక వ్యక్తి ఆ బాలికకు మాయమాటలు చెప్పి టెంట్ హౌస్ దుకాణంలోకి తీసుకువెళ్లాడు. ఇక అక్కడ అత్యాచారం చేశాడు. అయితే బాలిక గట్టిగా అరవడంతో చివరికి సదరు వ్యక్తి పరారయ్యాడు. కాగా నిందితుడి పై పోకుసో చట్టం కింద కేసులు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: