భార్య అలాంటి డ్రెస్సులు వేసుకుంటుందని.. గొంతు కోసిన భర్త?

praveen
భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ అని చెబుతారు పెద్దలు. ఇంకొకసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తర్వాత ఇక నిండు నూరేళ్ల పాటు కష్టసుఖాల్లో తోడునీడగా ఉంటూ ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు భార్య భర్తలు. అయితే ఇలాంటిదంతా ఇటీవల కాలంలో కేవలం మాటల్లో మాత్రమే కనిపిస్తుంది. కానీ నిజ జీవితానికి వచ్చేసరికి మాత్రం భార్యాభర్తల మధ్య నేటి రోజుల్లో ఇలాంటి అన్యోన్యత ఎక్కడ కనిపించడం లేదు.

 అయితే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తేనే వారి బంధం మరింత బలపడుతుంది అని పెద్దలు చెప్పేవారు. కానీ ఇటీవల కాలంలో ఇలాంటి చిన్న చిన్న గొడవలే ఏకంగా ఎన్నో దారుణమైన ఘటనలకు కారణమవుతున్నాయి. కొంతమంది చిన్న చిన్న గొడవలనే పెద్దదిగా చేసుకొని కోర్టు మెట్లు ఎక్కి విడాకులు తీసుకుని విడిపోతుంటే.. ఇంకొంతమంది ఏకంగా ఈ చిన్న కారణాలతోనే ఒకరి ప్రాణం ఒకరు తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఏకంగా ఒకరిపై ఒకరు అనుమానం పెంచుకుంటూ బద్ద శత్రువులుగా వ్యవహరిస్తూ దారుణంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి తరహా ఘటనలు వివాహ బంధం పై ఉన్న భావనను ప్రతి ఒక్కరు కూడా మార్చేస్తున్నాయి అని చెప్పాలి.

 ఇటీవలే కర్ణాటకలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఏకంగా ఫ్యాషన్ దుస్తులు ధరిస్తుంది అన్న కారణంతో భార్యను దారుణంగా చంపేశాడు భర్త. ఏడాది కిండత జ్యోతి అనే 22 ఏళ్ళ యువతికి జీవన్ అనే వ్యక్తికి ప్రేమ వివాహం జరిగింది. హాసన్ జిల్లాలోని అరిసెకేరే లో ఇద్దరు కాపురం పెట్టారు. అయితే ఫ్యాషన్ డ్రెస్ లను ఎక్కువగా ఇష్టపడే జ్యోతి పొట్టి దోస్తులు ధరిస్తూ ఉండేది. అయితే భర్త జీవన్ ఎంత వారించిన వినేది కాదు. ఇక ఇటీవలే ఆమె మోడరన్  డ్రెస్ వేసుకొని బయటకు వెళ్ళగా.. జీవన్ గొడవపడ్డాడు. గొడవ పెద్దది కావడంతో చివరికి భార్య గొంతు కోసి హత్య చేశాడు జీవన్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: