ఛీ ఛీ వీడు తండ్రేనా.. ఏడేళ్ల కూతురిని?
ఏకంగా రక్తం పంచుకుని పుట్టిన పిల్లల పాలిట తండ్రి కాల యముడిగా మారిపోయాడు. మానవత్వం అనే విషయాన్ని మరిచి ఏకంగా సొంత పిల్లల పాలిటఅత్యంత రాక్షసత్వంతో ప్రవర్తించాడు. చివరికి ఏకంగా సొంత పిల్లలను చంపేందుకు కూడా వెనకడుగు వేయలేదు. ఇలా పిల్లల పాలిట తండ్రి దారుణంగా ప్రవర్తించిన ఘటన ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడిన చేసింది అని చెప్పాలి. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన తండ్రి అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన ఏడేళ్ల కూతురి పట్ల అత్యంత కర్కషంగా ప్రవర్తించాడు.
ఏకంగా విచక్షణ కోల్పోయి బాలికను కాలుతున్న గడ్డివాములోకి విసిరేసాడు తండ్రి. బీర్కూరు మండలం బరన్ గేట్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పొరుగింటి వ్యక్తి వెంటనే స్పందించి ఏడేళ్ల చిన్నారిని కాపాడాడు. అయితే అప్పటికే బాలికకు తీవ్ర గాయాలు అయ్యాయి అని చెప్పాది. ఈ క్రమంలోనే స్థానికులు వెంటనే ఆ బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే సదరు దుర్మార్గపు తండ్రిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.