ఛీ ఛీ వీడు తండ్రేనా.. ఏడేళ్ల కూతురిని?

praveen
సాధారణంగా తండ్రి అనే వాడు పిల్లలకు భరోసా. తండ్రి పిల్లలతో కాస్త కఠినంగానే ఉంటాడు. కానీ లోలోపల మాత్రం పిల్లలపై అమితమైన ప్రేమను చూపిస్తూ ఉంటాడు. ఇక పిల్లల ప్రయోజకులు అయ్యేందుకు ఏకంగా తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి కష్టపడుతూ ఉంటాడు తండ్రి. ఇక పిల్లలకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు. తల్లిలా దగ్గరుండి గోరుముద్దలు తినిపించకపోవచ్చు. కానీ ఇక ఏకంగా ధైర్యం చెప్పేందుకు మాత్రం ఎప్పుడు వెన్నుముకగా నిలబడుతూ ఉంటాడు తండ్రి. అందుకే తండ్రి ప్రేమ ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు పెద్దలు. అయితే ఇలా పిల్లలకు ధైర్యం చెప్పి నేనున్నాను అనే ఒక భరోసా ఇవ్వాల్సిన తండ్రి ఇక్కడ నీచంగా ప్రవర్తించాడు.

 ఏకంగా రక్తం పంచుకుని పుట్టిన పిల్లల పాలిట తండ్రి కాల యముడిగా మారిపోయాడు. మానవత్వం అనే విషయాన్ని మరిచి ఏకంగా సొంత పిల్లల పాలిటఅత్యంత రాక్షసత్వంతో ప్రవర్తించాడు. చివరికి ఏకంగా సొంత పిల్లలను చంపేందుకు కూడా వెనకడుగు వేయలేదు. ఇలా పిల్లల పాలిట తండ్రి దారుణంగా ప్రవర్తించిన ఘటన ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడిన చేసింది అని చెప్పాలి. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన తండ్రి అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన ఏడేళ్ల కూతురి పట్ల అత్యంత కర్కషంగా ప్రవర్తించాడు.

 ఏకంగా విచక్షణ కోల్పోయి బాలికను కాలుతున్న గడ్డివాములోకి విసిరేసాడు తండ్రి. బీర్కూరు మండలం బరన్ గేట్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పొరుగింటి వ్యక్తి వెంటనే స్పందించి ఏడేళ్ల చిన్నారిని కాపాడాడు. అయితే అప్పటికే బాలికకు తీవ్ర గాయాలు అయ్యాయి అని చెప్పాది. ఈ క్రమంలోనే స్థానికులు వెంటనే ఆ బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే సదరు దుర్మార్గపు తండ్రిపై  చర్యలు తీసుకోవాలని స్థానికులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: