డ్రీమ్ 11 రూ.కోటిన్నర గెలిచిన పోలీసు అధికారి.. కట్ చేస్తే సొంత డిపార్ట్మెంట్ శత్రువు అయింది..!

praveen


డ్రీమ్ 11 అనేది ఫాంటసీ గేమింగ్ యాప్, ఇది వినియోగదారులు వారి సొంత టీమ్స్ సృష్టించుకోవడానికి, క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ వంటి మరిన్ని వివిధ క్రీడలలో పోటీ పడేందుకు అనుమతిస్తుంది. ముఖ్యంగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వంటి సెలబ్రిటీలను దాని యాడ్స్‌లో కనిపించిన తర్వాత ఈ యాప్ భారతదేశంలో బాగా పాపులర్ అయింది. చాలా మంది వినియోగదారులు యాప్‌లో ప్లే చేయడం ద్వారా భారీ మొత్తంలో డబ్బును గెలుచుకున్నట్లు పేర్కొన్నారు. వారి కొన్ని కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే, ఇటీవల, మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్‌కు చెందిన సోమ్‌నాథ్ జెండే అనే పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ డ్రీమ్ 11లో రూ. 1.5 కోట్లు గెలుచుకున్నాడు దాంతో ఆల్రెడీ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఈ అమౌంట్ గెలుచుకున్న తర్వాత అతడికి సంతోషం కంటే ఎక్కువగా బాధే మిగిలింది. కోటిన్నర గెలుచుకున్న తర్వాత అతడు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. జెండే ఈ ప్రైజ్ మనీతో తన ఆర్థిక సమస్యలన్నింటినీ పరిష్కరించుకున్నాడని అనుకున్నాడు. తన ఇంటి రుణాన్ని చెల్లించి, తన పిల్లల చదువుల కోసం పొదుపు చేయాలనుకున్నాడు. కానీ సంబరాలు చేసుకోవడానికి బదులుగా, అతను తన సొంత పోలీసు శాఖ వల్ల తీవ్ర బాధలో మునిగిపోయాడు.

గ్యాంబ్లింగ్‌గా భావించే యాప్‌లో జెండే ప్రమేయాన్ని పోలీసు అధికారులు ప్రశ్నించారు. ఇలాంటి గేమ్‌లో పాల్గొని తన విజయాల గురించి మీడియాతో మాట్లాడటం ద్వారా అతను తన సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించాడని వారు ఆరోపించారు. జెండే కేసుపై శాఖాపరమైన విచారణ జరిపి నివేదిక సమర్పించేందుకు డీసీపీ స్వప్నా గోర్‌ను నియమించారు. దీంతో ఏం చేయాలో తెలియక జెండే దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు.

డ్రీమ్ 11 అనేది రూ. 7535 కోట్ల (దాదాపు $1 బిలియన్) విలువను సాధించిన భారతదేశపు మొట్టమొదటి గేమింగ్ స్టార్టప్. ఈ కంపెనీ 2008లో స్థాపించబడింది. దేశవ్యాప్తంగా 110 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది. అయితే, యాప్ జూదాన్ని ప్రోత్సహిస్తోందని, కొన్ని చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఈ యాప్ వివిధ రాష్ట్రాలు, న్యాయస్థానాల నుండి అనేక చట్టపరమైన సవాళ్లను కూడా ఎదుర్కొంది. యాప్ లో నైపుణ్యం ఆధారంగా మాత్రమే డబ్బులు గెలుచుకోవడం కుదురుతుందని, జూదం లాగా గుడ్డి ఛాన్సెస్ పై ఆధారపడి లేదని ఇది భారతదేశంలోని అన్ని నిబంధనలకు అనుగుణంగా ఉందని కంపెనీ తనను తాను సమర్థించుకుంది. కానీ ఇప్పటికే దాన్ని ఒక గ్యాంబ్లింగ్ యాప్ గానే చాలామంది చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: