మటన్ కత్తితో భార్యను నరికిన భర్త.. కారణమేంటో తెలుసా?
ఈ క్రమంలోనే కట్టుకున్న వారికి కడవరకు తోడుంటాము అని ప్రమాణం చేసిన వారే చివరికి దారుణంగా హత్యలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కర్ణాటకలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది అని చెప్పాలి. ఏకంగా భార్యను దారుణంగా కొట్టిన కిరాతకమైన భర్త చివరికి ప్రాణాలను గాల్లో కలిపేసాడు. కోలూరు జిల్లా శ్రీనివాసపురం పట్టణంలో మటన్ దుకాణం పెట్టుకున్నాడు నగేష్. అతను ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే మొదటి భార్య రాధ బతికే ఉంది. అయితే మొదటి భార్య బతికుండగానే నగేష్ రెండో పెళ్లి చేసుకుని ఆమెతో ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుతున్నాడు. అయితే ఇటీవలే మొదటి భార్య తన స్వగ్రామమైన నంబహల్లి గ్రామంలో ఒక దుకాణం పెట్టుకుని టైలర్ పని చేస్తూ జీవన సాగిస్తుంది.
అయితే రెండో పెళ్లి చేసుకున్న నగేష్ కుటుంబ పోషణతో పాటు పిల్లల గురించిపూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. ఈ క్రమంలోనే భర్తకు విడాకులు ఇవ్వాలని అనుకుంది రాధా. ఈ విషయాన్ని నగేష్ కు చెప్పింది. అయితే విడాకులు ఇస్తానని మొదటి భార్య చెప్పడంతో కోపంతో రగిలిపోయిన నగేష్.. చివరికి మటన్ షాప్ లో ఉండే కత్తితో భార్యపై దాడి చేశాడు. అడ్డు వచ్చినందుకు వచ్చిన మామ మునిరాజుపై కూడా దారుణంగా కత్తితో దాడి చేశాడు. రాదను నరికి చంపిన నగేష్ పై గ్రామస్తులు తిరగబడ్డారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకొని.. నగేష్ ను అదుపులోకి తీసుకున్నారు.