ఒక గ్రామంలో ఒక్కటే కుటుంబం.. కారణం ఏమిటో తెలుసా?
ఈ ఊరికి వెళ్ళటానికి సరైన మార్గం లేదు. వర్షాకాలం లో ఊరంతా వర్షపు నీటితో నిండిపోతుంది. ఆ సమయంలో వారు బయటకు వెళ్లాలంటే పాడవే మార్గం. అందుకే వారు ఒక చిన్న పడవను తయారు చేసుకున్నారు. మిగిలిన కాలంలో నెలంతా చిత్తడిగా, బురద తో నిండి ఉంటుంది. కనీసం ఊరి నుంచి రెండు మైళ్ళ దూరం వెళ్తే గాని వాహనాలు నడవడానికి అనువైన నెల దొరకదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ దంపతులు తమ పిల్లలకు సరైన విద్య అందించడంలో రాజి పడలేదు. తమ ఇద్దరు పిల్లలు నరేన్, దీపాలి లు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. సియుతిలు హయ్యర్ సెకండరీ చదువుతోంది. ఈ గ్రామానికి కరెంటు సదుపాయం కూడా లేదు. పిల్లలంతా తమ చదువును కిరోసిన్ దీపాల దగ్గరే చదువుతారు.
ఇంతటి దీన పరిస్థితిలో ఉన్న ఈ 162 హెక్టార్ల విస్తీర్ణం ఉన్న ఊరుని ఆ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి బిష్ణురం మీది కొన్ని ఏళ్ళ క్రితం పర్యటించారట. ఆ ఊరికి రోడ్ కూడా ప్రారంభించారట. కానీ కాంట్రాక్టర్లు పని పూర్తి చెయ్యకుండా వేల్లోపోయారట. అక్కడ జిల్లా పరిషద్, గ్రామా పంచాయతీ, బ్లాక్ అభివృద్ధి అధికారులు ఆ ఊరిలో అభివృద్ధి చెయ్యడానికి ఎలాంటి ఆసక్తి చూపలేదట. ప్రతి ఏడాది వరదలకు గురయ్యే ఈ ఊరు ఏటికెటికి దిగజారిపోతూ...చివరకు పశువుల పెంపకం తప్ప మరేపనికి పనికిరాకుండా ఐపోయిందని వివరించారు దేక దంపతులు. ఇప్పుడు అక్కడికి ఒక ఎన్జిఓ వచ్చి అగ్రికల్చరల్ ఫార్మ్ ప్రారంభించింది. ఫార్మ్ చైర్మన్ ప్రీతి భూషణ్ దేక మాట్లాడుతూ, ఈ గ్రామానికి రోడ్ నిర్మించి, ప్రాధమిక వసతులు కల్పిస్తే మళ్ళి ఈ నెల సాగుకు పనికొస్తుందని అన్నారు.