ఇద్దరు మైనర్లపై అత్యాచారం.. చేసింది ఎవరో కాదు?

praveen
దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంది. ఈ టెక్నాలజీ మనిషి జీవనశైలిలో  ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ అటు ఆడపిల్లల రక్షణ మాత్రం రోజురోజుకు ప్రశ్నార్థకంగానే మారిపోతుంది. టెక్నాలజీ యుగంలో అయితే ఆడపిల్ల ధైర్యంగా బయట తిరగలేని పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే కామంతో కళ్ళు మూసుకుపోయిన మృగాలు ఆడపిల్ల ఎక్కడ ఒంటరిగా కనిపించినా కూడా దారుణంగా అత్యాచారాలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయని చెప్పాలి. అయితే ఇలా ఆడపిల్లలపై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చిన పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు


 ఇలాంటి తరహా ఘటనలు ఆడపిల్లలు భద్రతను రోజురోజుకు ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. దీంతో ఇలాంటి ఘటన చూసిన తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడపిల్ల మళ్ళి క్షేమంగా ఇంటికి వస్తుందో లేదో అని ఆడపిల్ల తల్లిదండ్రులు ప్రతిక్షణం భయపడుతూనే బ్రతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటీవల రాజస్థాన్లో అయితే దారుణ ఘటన వెలుగు చూసింది. ఏకంగా ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తండ్రితో కలిసి పనిచేసే ఇద్దరు వర్కర్లు మైనార్టీ బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే ఇటీవల ఇద్దరు బాలికలు గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అల్వార్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.


 15 ఏళ్ళు, 13 ఏళ్లు వయసున్న తన ఇద్దరు కూతుర్లని  కూడా సప్పి, సుభాన్ అనే ఇద్దరు వ్యక్తులు రేప్ చేశారని తండ్రి ఆరోపించారు. పెద్ద కూతురు కడుపులో నొప్పిగా ఉందని చెప్తే హాస్పిటల్ కి వెళ్ళామని.. డాక్టర్లు పరీక్షించి ఇక గర్భవతి అని తేల్చడంతో  షాక్ అయ్యామని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. తర్వాత తండ్రి బాలికలను ప్రశ్నిస్తే సబ్బి, సుభాన్ అనే ఇద్దరు రేప్ చేసారని ఏడుస్తూ చెప్పారు.  ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించడంతో ఎవరికి చెప్పలేదని బాలికలు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: