ఆస్పత్రిలో భర్త.. ఆ భార్య ఏం చేసిందో తెలుసా?

praveen
ధనవంతుడిని ఇంకా ధనవంతుడిగా మారుస్తున్న ఆ దేవుడు.. పేదోడి విషయంలో మాత్రం ఎందుకో జాలి దయ లేకుండా వ్యవహరిస్తున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూస్తూ ఉంటే. ఎందుకంటే పేదోడిని ధనవంతుడిని చేయాల్సిన పరిస్థితి లేదు. కానీ కనీసం కడుపునిండా అన్నం తిని హాయిగా బ్రతికేంత స్తోమతను ఇస్తే ఇంకా పేదోడికి ఇంకేం కావాలి. కానీ ఎందుకో దేవుడు పేదోడిని ఇంకా బాధపెడుతున్నాడు తప్ప అయ్యో పాపం అని మాత్రం జాలి పడటం లేదు.

 దీంతో పేదరికంలో మగ్గిపోతున్న ఎంతోమంది ఇక వచ్చిన రోగాలకు కనీసం వైద్యం చేయించుకోలేక ఇక.. ఎంత కష్టపడినా ఇక పిల్లలను బాగా చదివించలేక.. మూడు పూటలా అన్నం తినడానికే భారమై ఇక దుర్భర జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇలా పేదోడికి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి చివరికి ఈ బతుకు ఎందుకు ఇచ్చావు దేవుడా అని బాధపడుతూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని ఆ దేవుడే తీసుకొస్తున్నాడు. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ఆర్థిక సమస్యలే ఆ కుటుంబాన్ని మొత్తాన్ని చివరికి మృత్యుఒడిలోకి చేర్చాయి అని చెప్పాలి.

 మెదక్ జిల్లాలో ఒక విషాదకర ఘటన జరిగింది  వెంకటాపూర్ శివారు లోని  కొంటూరు చెరువు లో ఆత్మహత్యకు పాల్పడ్డారు ముగ్గురు. అయితే రామాయం పేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన 28 ఏళ్ల లక్ష్మి, కూతుర్లు శరణ్య (4), చిన్నారి (2) తో కలిసి చెరువులో దూకే ఆత్మహత్య చేసుకుంది. భర్త ఎల్లం వారం రోజుల క్రితం ఆర్థిక సమస్యతో ఆత్మహత్యయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే వైద్యం చేయించేందుకు కూడా ఆర్థిక స్తోమత సరిగ్గా  లేకపోవడంతో మనస్థాపంతో భార్య పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: