పెళ్ళై పదేళ్లయిన పిల్లలు పుట్టలేదని.. భర్త ఏం చేశాడంటే?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. ఈ క్రమంలోనే నచ్చిన భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించి ఇక జీవితాంతం సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే మూడుముళ్ల బంధంతో దాంపత్య బంధం లోకి అడుగుపెట్టిన యువతి యువకులు ఇద్దరు కూడా ఇక పిల్లలను కనాలని ఎంతగానో ఆశ పడుతూ ఉంటారు. అయితేపిల్లలు పుట్టడం అనేది మనిషి చేతిలో లేదేమో దేవుడు చేతిలో ఉందేమో.. అని అనిపిస్తూ ఉంటుంది కొంతమందిని చూసిన తర్వాత. ఎందుకంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ.. దాదాపు పెళ్లిపెళ్లి జరిగిన తర్వాత చాలా ఏళ్లకు పిల్లలు కావడం జరుగుతూ ఉంటుంది. మరి కొంతమందికి ఏకంగా పెళ్లయిన ఏడాదికే పిల్లలు పుట్టడం చూస్తూ ఉంటాం.

 అయితే ఇలా పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోతే అటు సభ్య సమాజం నుంచి ఎన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే సమయంలో కొన్ని కొన్ని సార్లు ఇక ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం కూడా చూస్తూ ఉంటాం. అయితే ఇక భార్యాభర్తల మధ్య జరిగే ఇలాంటి గొడవ ఇక ఎన్నోదారుణలకు కారణమవుతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. పెళ్లయి ఏళ్ళు గడుస్తున్నా వారికి పిల్లలు పుట్టలేదు. ఇక ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఇక ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరుగుతూ ఉండేది.

 ఇటీవలే మరోసారి భార్యాభర్తల మధ్య ఇదే విషయంపై గొడవ జరిగిన నేపథ్యంలో.. భర్త కఠిన నిర్ణయం తీసుకున్నాడు. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంటలో వెలుగులోకి వచ్చింది. ఎల్లయ్య, సునీత భార్య భర్తలు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే ఎల్లయ్య ఊర చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. చెరువు వద్ద బైక్, చెప్పులు ఉండడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు.. చెరువులో గాలించగా మృతదేహం లభించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: