భార్యను ముక్కలుగా నరికేశాడు.. అంతటితో ఆగకుండా?
వెరసి చిన్న చిన్న గొడవలకే మనస్థాపంతో ఇక దాంపత్య బంధానికి స్వస్తి పలుకుతున్న వారు కొంతమంది అయితే.. కట్టుకున్న వారిని దారుణంగా హతమారుస్తున్న వారు మరి కొంతమంది.. ఇంకొన్ని ఘటనల్లో ఇక జీవితం నాశనమైంది అని భావిస్తూ మన స్థాపంతో ఆత్మహత్య చేసుకుంటూ బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు కొంతమంది. వెరసి భార్యాభర్తల బంధం అంటే మాత్రం ప్రాణాలు పోవడానికి చిరునామాగా మారింది.
అయితే ఇటీవలే ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో కూడా ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. వీరపాలెంలో ఏకంగా భార్యను దారుణంగా ముక్కలుగా నరికేసాడు దుర్మార్గపు భర్త. మద్యానికి బానిసైన గంజి దావీదు డబ్బు కోసం తరచూ భార్య నిర్మలను వేధిస్తూ ఉండేవాడు. దీంతో తన ఇద్దరు కుమార్తెలు కొడుకును పుట్టింట్లోనే వదిలి ఉపాధి కోసం కువైట్ వెళ్లిపోయింది నిర్మల. అయితే తాను మారిపోయానని నమ్మించి ఇటీవలే భార్యను ఇంటికి రప్పించాడు. ఇక తర్వాత తెల్లవారుజామున నిర్మల మెడ చేయిని నరికేశాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.