బుజ్జి కన్నా.. నాకోసం ప్రాణాలిస్తావా.. ప్రేమగా అడిగి చంపేసిన భర్త?

praveen
మంచి ఆలోచన శక్తికి.. విచక్షణకు కేరాఫ్ అడ్రస్ మనిషి. అందుకే భూమ్మీద కోట్లాది జీవులు ఉన్నప్పటికీ అన్ని జీవుల్లో మనిషి ప్రత్యేకమైన జీవిగా గుర్తింపు సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఏ విషయంలో ఎలా ప్రవర్తించాలి.. ఎవరి పట్ల ఎలా విచక్షణతో వ్యవహరించాలి అన్న విషయం మనిషికి బాగా తెలుసు. కానీ ఇదంతా ఒకప్పటి మాట. నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనిషిలో ఉండే విచక్షణ జ్ఞానమే రోజురోజుకు కనుమరుగైపోతుంది అన్నది అర్థమవుతుంది.

 ఎందుకంటే చిన్న చిన్న విషయాలకే విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్న మనుషులు ఏకంగా సొంత వారి విషయంలో కూడా రాక్షసత్వంతోనే వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే చిన్న చిన్న కారణాలకే చివరికి ప్రాణాలను గాల్లో కలిపేస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలా మనుషుల ప్రవర్తన తీరు చూసిన తర్వాత మనుషుల కంటే అడవుల్లో ఉండే క్రూర మృగాలే కాస్తయినా బెటర్ ఏమో అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.

 సినిమాల్లో చూశాడో లేక అతనికే అనిపించిందో తెలియదు కానీ కట్టుకున్న భార్యను కష్టం రాకుండా చూసుకోవాల్సింది పోయి దారుణంగా హతమార్చాడు. బుజ్జి కన్నా నాకోసం ప్రాణాలు ఇస్తావా అంటూ ప్రేమగా అడిగి.. చివరికి భార్య గొంతునులిమి హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్ లోని బారిలిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పదరత్ పూర్ గ్రామానికి చెందిన ఫరూక్ అనే వైద్యుడు తన భార్య నస్రిన్ ను చంపేశాడు. ఆ తర్వాత డబ్బు నగలతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఇక భర్తను అదుపులోకి తీసుకొని విచారించగా అతడే నిందితుడు అన్న విషయం బయట పడింది. వేరొక మహిళతో పెళ్లికి సిద్ధమైన ఫరూక్ ఇక ఇలాంటి దారుణానికి ఒడిగట్టినట్లు  పోలీస్ విచారణలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: