పిల్లనిచ్చిన మామ వేధింపులు.. అల్లుడు ఆత్మహత్య?

praveen
సాధారణంగా అమ్మాయి తరపు తల్లిదండ్రులు ఇక పెళ్లి చేసే సమయంలో వరుడికి భారీగా కట్న కానుకలు ముట్ట చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక తన అల్లుడు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని తమ కూతురుని సంతోషంగా ఉంచాలని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కేవలం పెళ్లి చేసే సమయంలో కట్న కానుకలు మొట్ట చెప్పడమే కాదు ఇక పెళ్లి జరిగిన తర్వాత కూడా అల్లుడికి ఏదైనా సహాయం కావాలి అంటే ప్రతిఫలం ఆశించకుండానేఅమ్మాయి తల్లిదండ్రులు చేసేస్తూ ఉంటారు అని చెప్పాలి.

 ఇలా తమ అల్లుడు కూతురు కలకాలం పిల్ల పాపలతో ఎంతో సంతోషంగా ఉండాలని ఇక ఎవరైనా కోరుకుంటూ ఉంటారూ. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఒక మామ అల్లుడిని వేధించడం మొదలుపెట్టాడు.  దీంతో ఇక మామ వేధింపులు తట్టుకోలేకపోయిన అల్లుడు చివరికి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇలా ఆ తండ్రి అల్లుడు వేదించి ఏకంగా కూతురికి పసుపు కుంకాలు తెగిపోయే పరిస్థితిని తీసుకొచ్చాడు అని చెప్పాలి. ఈ ఘటన ఎక్కడో కాదు నిజాంబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.

 అప్పు చెల్లించాలంటూ మామ తరచూ అల్లుడిని వేధిస్తున్న నేపథ్యం లో ఇక మనస్థాపం చెందిన అల్లుడు చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. సందీప్ అనే వ్యక్తికి నవీపేట మండలం లో నాకు చెందిన ప్రియతో పెళ్లి జరిగింది. అయితే అల్లుడి వ్యాపారం కోసం మామ 5 లక్షల రూపాయల అప్పు ఇప్పించాడు మామ. కానీ వ్యాపారంలో నష్టాలు రావడం తో అల్లుడు సందీప్ దానిని తిరిగి చెల్లించలేక పోయాడు. ఈ క్రమం లోనే మరదలు పెళ్లికి వెళ్లిన సందీప్ ను అందరి ముందు మామ అప్పు గురించి నిలదీస్తూ అవమానించాడు. దీంతో పరువు పోయిందని జీర్ణించుకో లేక పోయినా అల్లుడు సందీప్ గోదావరి లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: