సర్పంచ్ కొట్టాడని.. ఆ యువకుడు ఏం చేసాడో తెలుసా?

praveen
ఇటీవలి కాలంలో ఆత్మహత్య అన్నది ప్రతి సమస్యకు పరిష్కారంగా మారిపోయిందేమో  అనిపిస్తుంది. ఎందుకంటే నేటి రోజులలో జనాలు ఏ చిన్న సమస్య వచ్చినా సూసైడ్ చేసుకునీ బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలే ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. చిన్నచిన్న కారణాలకే మనస్థాపం చెంది చివరికి నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఒక ప్రేమ జంట కు సహకరించడమే ఆ యువకుడి పాలిట శాపంగా మారి పోయింది. ప్రేమ జంట ఊరు నుండి పారిపోవడానికి సహకరించారు అంటూ సర్పంచ్ ఏకంగా ముగ్గురు యువకులను మందలించాడు.

 అంతటితో ఆగకుండా ఆ ముగ్గురు యువకుల పై చేయి చేసుకున్నాడు సర్పంచ్. ఈ క్రమంలోనే ఆ ముగ్గురిలో ఒక యువకుడు తీవ్ర మనస్తాపం చెందాడు. అందరి ముందు సర్పంచ్ తనపై చేయిచేసుకోవడం అసలు జీర్ణించుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం లో వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా నర్సాపురం మండలం గండిగూడెం గ్రామానికి చెందిన భవాని శంకర్ నారం వారి గూడెం లో ని అమ్మమ్మ తాతయ్య వద్ద ఉంటూ డిగ్రీ చదువుతున్నాడు.

 అయితే ఇటీవలే ఓ ప్రేమజంట ఊరి నుంచి పారిపోయింది. ఇక ఆ జంట వెళ్లిపోవడానికి ముగ్గురు యువకులు సహకరించారని గ్రామ సర్పంచ్ వెంకట ముత్యం భావించారు. ఈ క్రమంలోనే భవానీశంకర్, ముత్యాలరావు,  వేముల నాగరాజు లను పంచాయతీ కార్యాలయానికి పిలిపించి వారిపై చేయి చేసుకున్నాడు సర్పంచ్. ప్రేమజంట ఆచూకీ చెప్పకపోతే చంపేస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత భవానీశంకర్ మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. అతని ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ మరణించాడు. చనిపోయే ముందు అతడు సర్పంచ్ కొట్టినందుకు ఆత్మహత్య చేసుకుంటున్నా అన్న విషయాన్ని సెల్ఫీ వీడియో తీసుకోగా వీడియో వైరల్ గా మారింది.. దీంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్  ఎదుట నిరసన చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: