పగబట్టిన ఏనుగు..ఏం చేసిందంటే?

Satvika
పాము పగ పట్టింది అంటే అందరికి తెలుసు..కానీ వేరే జంతువులు పగ పట్టాయి అంటే ఎవరూ నమ్మరు..కానీ ఇప్పుడు జరిగిన ఘటన వింటే ఎవరైనా నమ్మాల్సిందే.. ఈ విషయం గురించి ఎవరినైనా ప్రశ్నిస్తే భిన్న రకాల సమాధానాలు వస్తాయి. అవునని కొందరంటే.. అలాంటిదేమీ ఉండదని మరికొందరంటారు. అవుననే వారు దానికి బలాన్ని చేకూర్చేందుకు కొన్ని ఘటనలు వివరిస్తే మాత్రం కాదు అంతా అపద్దం మేము నమ్మము అని అంటారు.


అవేదో కో ఇన్సిడెన్స్ లో జరిగాయి అని వాదిస్తారు. సరే ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. తాజాగా ఒడిశాలో జరిగిన ఓ ఘటన మాత్రం జంతువులు పగబడతాయని.. గుర్తుంచుకొని మరీ దాడి చేస్తాయని చెప్పే వారి వాదనకు బలానిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే ?ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో మాయా ముర్ము అనే 70 ఏళ్ల వృద్ధురాలు గురువారం ఉదయం రాయపాల్ గ్రామంలోని గొట్టపు బావి నుండి నీళ్లు తీసుకువస్తోంది. ఇదే సమయంలో దాల్మా వన్యప్రాణుల అభయారణ్యం నుండి సంచరిస్తున్న ఓ అడవి ఏనుగు ఆమెపై దాడి చేసింది. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. వెంటనే ఆమెను పలువురు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ వృద్ధురాలు కావడం, ఏనుగు బలంగా దాడి చేయడం వల్ల ఆమె చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయింది..



ఏనుగు దాడి తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ తుది శ్వాసను విడిచింది.పాడెపై ఎక్కించుకొని చితి వద్దకు తీసుకెళ్లారు. మృతదేహాన్ని చితిపై ఉంచగానే మళ్లీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ.. వృద్ధురాలిపై దాడి చేసిన ఏనుగు ఆకస్మికంగా అక్కడ ప్రత్యక్షమైంది. దానిని చూసిన గ్రామస్తులు, బంధువులు ఖంగుతిన్నారు. ఆ ఏనుగు నేరుగా చితి వద్దకు అక్కడి నుంచి తీసుకెళ్లింది. మళ్లీ ఆమె శరీరాన్ని తొక్కి, విసిరిపారేసింది..తర్వాత ఏనుగు వెళ్ళిన తర్వాత ఆమె మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలను నిర్వహించారు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది..నిజంగా ఇలా చేసిందా అనే సందేహం లో చాలా మంది ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: