పక్కనే తల్లి శవం.. ఫ్రెండ్స్ తో దావత్..చివరికి..

Satvika
ఇప్పుడు అందరు బిజీ బిజీ జీవితాన్ని గడుపుతున్నారు.. డబ్బులు సంపాదనలో పడి పిల్లలను పట్టించుకోవడం మానెసారు.దాంతో పిల్లలు ఇష్టం వచ్చినట్లు తయారు అవుతున్నారు..నేరాలను చెయ్యడానికి కూడా వెనుకాడరు. సమాజం ఎటు పోతూంది, యువత ఎటు పోతున్నారు. అనే విషయం తెలియడం లేదు. మొబైల్ ఫోన్ చాలా మందికి గొడవలు పెడుతున్నాయి.ఈ గేమ్ లతో పిల్లలు సగం చెడిపోతున్నారు...ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి.. తాజాగా మరో దారుణ ఘటన వెలుగు లోకి వచ్చింది.


యూపీ లక్నోలో జరిగిన ఈ దారుణం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తల్లి మందలింపుతో క్షణికావేశంలో తండ్రి తుపాకీ తీసుకుని ఘాతుకానికి పాల‍్పడ్డాడు సదరు టీనేజర్‌. అయితే ఈ ఘటనలో.. విస్తుపోయే విషయాలను పోలీసులు తాజాగా వెల్లడించారు.ఆదివారం అర్ధరాత్రి సమయంలో మొబైల్‌లో పబ్‌జీ ఆడుతూ కనిపించాడు సదరు మైనర్‌(16). అది చూసి పట్టరాని కోపంతో తల్లి సాధన(40) మందలించింది.

 
దీంతో అతనిలోనూ కోపం కట్టలు తెంచుకుంది. ఇం‍ట్లో బీరువాలో ఉన్న తన తండ్రి సర్వీస్‌ రివాల్వర్‌ తో తల్లిని కాల్చేశాడు. తల్లిని చంపాక ఓ గదిలో ఆమె శవాన్ని ఉంచి తాళం వేశాడు. ఆ శబ్దానికి నిద్రిస్తున్న అతని సోదరి(10) లేచింది. భయం తో అరిచే ప్రయత్నం చేసింది. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి మరో గదిలో ఉంచి తాళం వేశాడు.తన ఫ్రెండ్స్ ను రమ్మని చెప్పి ఆన్‌లైన్ లో ఫుడ్ ను ఆర్డర్ చేశాడు.మృతదేహాం దుర్వాసన వస్తుండడం తో రూమ్‌ఫ్రెష్‌నర్‌ స్ప్రే చేశాడు. అయినా కూడా కుళ్లిన కంపు పొరుగిళ్లకు చేరింది. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసుల కు సమాచారం అందించారు. పోలీసుల ఎంట్రీతో ఈ దారుణం బయటపడింది. గదిలో బంధించడం తో స్పృహ కోల్పోయిన మృతురాలి కూతురిని ఆస్పత్రికి తరలించారు.. తండ్రి ఆర్మీ ఉద్యోగి..అతణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: