పెళ్లయిన రెండోరోజే.. ఇలా జరుగుతుందని ఎవరనుకుంటారు?

praveen
పెళ్ళంటే నూరేళ్ళ పంట అని చెబుతూ ఉంటారు. కానీ ఇటీవలి కాలంలో అదే పెళ్లి ఎంతోమంది పాలిట శాపంగా మారి పోతుంది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక తల్లిదండ్రుల ఒత్తిడి తో బలవంతపు పెళ్ళిళ్ళు చేసుకుంటున్న ఎంతోమంది జీవితాంతం బాధపడుతూ బతకడం కంటే చివరికి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణాలకు పాల్పడటం మంచిది అనుకుంటూ ఎంతోమంది క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలా పెళ్ళయ్ కొన్నాళ్లు కూడా గడవకముందే ఆత్మహత్యలు చేసుకుంటున్నా వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. పెళ్లయిన రెండో రోజే ఆత్మహత్య చేసుకున్నాడు వరుడు.

 దైవ దర్శనానికి వెళ్లే క్రమంలో అందరినీ తెల్లవారుజామునే నిద్ర లేపాడు సదరు యువకుడు. కానీ అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం లో వెలుగులోకి వచ్చింది. పుణ్య పురం గ్రామానికి చెందిన కంభంపాటి నరేష్ అనే 29 ఏళ్ల యువకుడు ఏపీ లోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం ఆర్ల పాడు కు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. అదేరోజు వరుడి స్వగ్రామంలో రిసెప్షన్ ఏర్పాటు చేయగా ఆ వేడుకలో కూడా నరేష్ ఎంతో సంతోషంగా గడిపాడు.

 ఈ క్రమంలో నూతన వధూవరులు ఇద్దరినీ కూడా సమీపంలో ఉన్న ఒక దేవాలయానికి దైవదర్శనానికి తీసుకువెళ్లాలి అని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే తెల్లవారుఝామున నాలుగు గంటలకే నిద్రలేచి బంధువులు అందరికీ కూడా వెంటనే రెడీ కావాలి అంటూ నిద్రలేపాడు నరేష్. స్నానం చేసి వస్తాను అంటూ గదిలోకి వెళ్ళాడు. బంధువులందరూ ప్రయాణ ఏర్పాట్లలో మునిగిపోయారు. కానీ అంతలో నరేష్ గదిలోకి వెళ్లి చూడగా ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. రక్తపు మడుగులో  విగతజీవిగా కనిపించాడు నరేష్. బ్లేడుతో మణికట్టు తోపాటు గొంతు కూడా కోసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: