దివ్యాంగురాలు అని కనికరం లేకుండా దారుణం..ఛీ..ఛీ..

Satvika
ప్రభుత్వం కొత్త చట్టాలు అమలు చేస్తూ మహిళల రక్షణకు కోసం కృషి చేస్తున్నారు.. ఎంథగా కఠినంగా అమలు చేస్తున్న కూడా కామందుల తీరులో మార్పులు మాత్రం రాలేదు..ఎక్కడో చోట మహిళలు దాడులకు గురి అవుతున్నారు.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఓ వ్యక్తి దారుణాల కు పాల్పడ్డారు.. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగు లోకి వస్తున్నాయి.. అధికారం ఉంది కదా అని ఓ వ్యక్తి మహిళ పై అత్యాచారాని కి పాల్పడ్డాడు.. ఆ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.


వివరాల్లొకి వెళితే.. మధ్యప్రదేశ్‌ లోని ఓ దివ్యాంగురాలైన మహిళ.. ఓ రైల్వే టీసీ(టికెట్ కలెక్టర్) తనపై లైంగిక దాడికి పాల్పడిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. సాగర్ రైల్వే స్టేషన్‌ లో విధులు నిర్వహిస్తున్న టీసీ ఒక వికలాంగ మహిళ పై అత్యాచారానికి పాల్పడ్డాడు.. తనతో గడపకుంటే మాత్రం వేరేలా వుంటాయి అని బెదిరించాడు.. ఆ తర్వాత పెద్ద ఆఫీసర్ వద్దకు తీసుకెళతానని చెప్పి ఆమెను క్వార్టర్స్‌ కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.


మరుసటి రోజు మహిళ పోలీసులకు నిందితుడు టిసిపై కేసు పెట్టింది. సమాచారం ప్రకారం మహిళ తన భర్త తో కలిసి గుణను వదిలి సాగర్‌కు వెళ్లింది. వికలాంగురాలు కావడం తో భర్త ఆమెను రైలు లో కూర్చోబెట్టి టిక్కెట్టు తీసుకునేందుకు వెళ్లాడు. ఆ తర్వాత రైలు తప్పిపోవడం తో ఆ మహిళ కు టిక్కెట్ రాలేదు. రైలు సాగర్ స్టేషన్‌కు చేరుకోగానే మహిళ దిగి ప్లాట్‌ ఫారమ్‌ నుంచి బయటకు వెళ్లడం ప్రారంభించింది. అతను అడ్డుకొని ఆమెను భయపెట్టి అత్యాచారం చేశాడు.. తర్వాత రోజు వరకూ ఆమెను వదిలిపెట్టకుండా తనతో ఉంచుకున్నాడు.. తర్వాత బయట పడిన మహిళ భర్తకు ఈ విషయం చెప్పడం తో పోలీసులను అస్రయించారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: