ఆ గిఫ్ట్ వల్లే ప్రాణాల మీదకు వచ్చిందా..మ్యాటరేంటంటే?

Satvika
ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందంగా పెళ్ళి వేడుకలను చేసుకుంటారు.బంధువుల సమక్షంలో ఒకటైన జంటలకు కొన్ని సార్లు ఆ సంతోషం కేవలం ఒకరోజు ముచ్చటగానే ఉంటుంది..కొన్ని ఊహించని ఘటనలు జరగడం వల్ల కొలుకొలేని పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి..ఇప్పుడు అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అందరి మధ్య వివాహం తో ఒకటైన జంటకు ఓ బొమ్మ  చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. పెళ్ళి కొడుకు చెయ్యి పొయ్యెలా చేసింది.


పెళ్లికి వచ్చిన బహుమతులను ఓపెన్ చేసి ఏఏ గిఫ్ట్స్ వచ్చాయో చూసుకుంటున్నారు.ఫ్రెండ్స్, బంధువులు ఎవరు ఏ గిఫ్ట్స్ ఇచ్చారో చూసుకుంటుండగా.. అందులో ఓ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే.. అందులో ఒకటి రీఛార్జ్‌బుల్ టాయ్ ఉంది. దాన్ని తీసి రీఛార్జ్ పెట్టేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా అది బ్లాస్ట్ అయింది. దీంతో పెళ్లి కుమారుడు, పక్కనే ఉన్న పెళ్లి కుమార్తె కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గుజరాత్ లో వెలుగు చూసింది.నవ్సారి జిల్లాలోని మింధబారి గ్రామంలో మే 12వ తేదీన లతీష్ గవిత్, సల్మాలపెళ్లి ఘనంగా జరిగింది. ఈ వివాహానికి బంధువులు, స్నేహితులు హాజరై వధూవరులను ఆశీర్వదించి కొందరు బహుమతులు కూడా ఇచ్చారు.

పెళ్లి హడావుడి అంతా ముగిసిన తర్వాత మే 17న లతీష్, అతని మేనల్లుడు జియాన్‌ తో కలిసి తమ ఇంట్లో పెళ్లికి వచ్చిన బహుమతుల ను ఓపెన్ చేయడం మొదలు పెట్టారు. ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూస్తుండగా.. అందులో ఉన్న ఒక రీఛార్జ్‌బుల్ టాయ్ ని చూసి రీఛార్జ్ పెట్టేందుకు ప్రయత్నించారు.. ఆ సమయంలో అది బ్లాస్ట్ అయ్యింది. దాంతో వధూవరులకు తీవ్ర గాయాలూయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి  పై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: