తాగొచ్చి అలా చేశాడని.. భర్త మర్మాంగం కోసిన భార్య.. చివరికి?

praveen
భార్య భర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి. ఒకసారి పెద్దల సాక్షిగా వేదమంత్రాల సాక్షిగా మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తర్వాత కష్టం వచ్చినా సుఖం వచ్చిన నీకు నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తూ తోడు నీడ గా ఉండాలి. కానీ ఇటీవలి కాలంలో మాత్రం భార్యాభర్తల మధ్య ఇలాంటి అన్యోన్యత మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన వారు కొన్నాళ్ళ పాటు సంతోషంగా ఉంటున్నా ఆ తర్వాత మాత్రం మనస్పర్ధలు మొదలవుతున్నాయి.

 సర్దుకుపోయి ఎక్కడ జీవించడం లేదు. నేనే గొప్ప అంటే నేనే గొప్ప అంటూ ఈగోల కు పోయి చివరికి పచ్చని కాపురంలో చిచ్చు పెట్టుకుంటున్న  ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మరికొన్ని చోట్ల అక్రమ సంబంధాలు ఎంతో మంది భార్యాభర్తలు విడిపోయే పరిస్థితులను తీసుకు వస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక కొన్ని కొన్ని సార్లు ఇలాంటి అక్రమ సంబంధాలు ఏకంగా భార్యాభర్తల బద్ద శత్రువులు గా మారి ఒకరి ప్రాణాలు మరొకరు   తీసేందుకు కూడా వెనుకాడని పరిస్థితులను తీసుకొస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకున్నావ్ అంటూ భర్త తరచు సూటిపోటి మాటలతో వేధించేవాడు. దీంతో విసిగి పోయిన భార్య భర్త మర్మాంగాన్ని కోసేసింది.

 మహారాష్ట్రలోని కొల్హాపూర్లో వ్యవసాయ క్షేత్రంలో వందనా, ప్రకాష్ నివాసముంటున్నారు. అయితే భార్యకు వివాహేతర సంబంధం ఉంది అనే అనుమానంతో ప్రకాష్ తాగుడుకు బానిస గా మారిపోయాడు. ప్రతి రోజూ తాగొచ్చి ఆమెను కొడుతూ సూటిపోటి మాటలతో వేదిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి కూడా తాగచ్చి కొట్టడంతో విసుగుచెందిన వందన దారుణంగా హతమార్చింది. కత్తితో భర్త మర్మాంగాలను కోసి హత్య చేస్తుంది. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక నిందితురాలిని  అదుపులోకి తీసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: