ఉప్పులో మత్తుమందు కలిపి భర్తను హత మార్చిన భార్య..ఎందుకంటే?
ఆమె నటన పై అనుమానం వచ్చిన అత్తింటి వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు..ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అసలు ఏమైంది అనే విషయాన్ని బయట పెట్టారు.భార్య చెప్పిన సమాధానం పొంతన లేకుండా ఉండటంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు.కట్ చేస్తే ఈ ఘటన ఘజియాబాద్లో వెలుగు చూసింది.రాకేష్, కుసుమ్ దంపతులు నివాసం ఉంటున్నారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా జీవించేవారు. అయితే వారి జీవితంలో అనుకోని సమస్యలు వచ్చిపడ్డాయి. కుసుమ్కు మనోజ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త లేని సమయంలో కుసుమ్.. ప్రియుడితో కలుస్తూ ఉండేది. అయితే భర్త అడ్డు తొలగించుకుంటే రోజూ కలుసుకోవచ్చని కుసుమ్, ఆమె ప్రియుడు కుట్రపన్నారు.
మే 1వ తేదీన ఉప్పులో మత్తు మందు కలిపి అన్నంలో కలిపి భర్తకు పెట్టింది. అది తిన్న కొద్ది సేపటికే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.తర్వాత ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసింది. రాకేష్ అనారోగ్య కారణంగా మృతి చెందాడని అత్తింటి వారికి చెప్పింది. రాకేష్ మృతదేహాన్ని అతడి స్వగ్రామం బులంద్షహర్కు తీసుకెళ్లారు. ఇదిలావుండగా భర్త మృతదేహం పక్కన కూర్చుని విలపిస్తున్న కుసుమ్ను ను చూడగానే అందరికి అనుమానం వచ్చింది దీంతో వాళ్ళు పోలీసులకు చెప్పడంతో అసలు విషయం బయటకు వచ్చింది. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి..