స్నేహానికి ద్రోహం.. ఛీ ఛీ ఎంత పని చేసాడు?
ఇద్దరూ కలిసే ఉండేవారు. దీంతో వీరి స్నేహబంధం చూసి అందరూ మురిసిపోయేవారు. అయితే గత నెల 30వ తేదీన పరమేష్ భార్య తన ఇద్దరు పిల్లలతో కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులకు ఏం చేయాలో అర్థం కాలేదు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు తన స్నేహితుడు విశ్వనాథ్ పై అనుమానం వ్యక్తం చేశాడు పరమేష్. తన భార్య ఇద్దరు పిల్లలు అపహరించుకుపోయాడు ఆరోపించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఇకపోతే విశ్వనాథ్ కు మూడు నెలల క్రితమే అనురాధ అనే యువతితో వివాహం జరిగిందని తెలుస్తోంది.
అయితే ఏకంగా ఇద్దరు పిల్లలు ఉన్న ఒక మహిళను తన భర్త అపహరించుకుపోయాడు అంటూ కేసు నమోదైనట్లు తెలుసుకున్న అనురాధ తన జీవిత ఏం కావాలి అంటూ బోరున విలపించింది. ఈ క్రమంలోనే భర్త విశ్వనాథ తండ్రినీ నిలదీసింది. అయితే దీనిపై స్పందించిన ఆయన తన కొడుకు తిరిగి రాకపోతే ఆస్తి మొత్తాన్ని కోడలు పేరుమీద రాస్తాను అంటూ మాట ఇచ్చాడు. అయితే తన భర్త ఆచూకీ కనుక్కోవాలి అంటూ విశ్వనాధ్ భార్య అనురాధ సైతం పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. దీంతో ప్రస్తుతం వీరిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు..