స్నేహానికి ద్రోహం.. ఛీ ఛీ ఎంత పని చేసాడు?

praveen
ఇటీవలి కాలంలో మానవ బంధాలకు విలువ ఇవ్వని మనుషులు చేస్తోన్న నీచాతి నీచమైన పనులు సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కట్టుకున్న బంధాన్ని కాదని అక్రమసంబంధాలకు తెర లేపుతు దారుణాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఒక వివాహిత పిల్లలతో కలిసి భర్తను కాదని సభ్య సమాజాన్ని ఎదిరించి ప్రియుడుతో పారిపోయింది. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. వికారాబాద్లో వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన బషీరాబాద్ మండలంలోని ఓ గ్రామంలో నివసిస్తున్నారు భార్య భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే ఇదే గ్రామానికి చెందిన  విశ్వనాథ్ పరమేశన్ చిన్న నాటి స్నేహితులు.

 ఇద్దరూ కలిసే ఉండేవారు. దీంతో వీరి స్నేహబంధం చూసి అందరూ మురిసిపోయేవారు. అయితే గత నెల 30వ తేదీన పరమేష్ భార్య తన ఇద్దరు పిల్లలతో కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులకు ఏం చేయాలో అర్థం కాలేదు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు తన స్నేహితుడు విశ్వనాథ్ పై అనుమానం వ్యక్తం చేశాడు పరమేష్. తన భార్య ఇద్దరు పిల్లలు అపహరించుకుపోయాడు ఆరోపించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఇకపోతే విశ్వనాథ్ కు మూడు నెలల క్రితమే అనురాధ అనే యువతితో వివాహం జరిగిందని తెలుస్తోంది.

 అయితే ఏకంగా ఇద్దరు పిల్లలు ఉన్న ఒక మహిళను తన భర్త అపహరించుకుపోయాడు అంటూ కేసు నమోదైనట్లు తెలుసుకున్న అనురాధ తన జీవిత ఏం కావాలి అంటూ బోరున విలపించింది. ఈ క్రమంలోనే భర్త విశ్వనాథ తండ్రినీ నిలదీసింది. అయితే దీనిపై స్పందించిన ఆయన తన కొడుకు తిరిగి రాకపోతే ఆస్తి మొత్తాన్ని కోడలు పేరుమీద రాస్తాను అంటూ మాట ఇచ్చాడు. అయితే తన భర్త ఆచూకీ కనుక్కోవాలి అంటూ విశ్వనాధ్ భార్య అనురాధ సైతం పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.  దీంతో ప్రస్తుతం వీరిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: