మద్యం మత్తు.. మందులో నీళ్ళకు బదులు యాసిడ్.. చివరికి?

praveen
ఇటీవలి కాలంలో మద్యానికి బానిసగా మారుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు మద్యం అలవాటు ఉన్న వారినే చెడ్డవారిగా చూసేవారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం మద్యం తాగకుండా ఉన్న వారిని విచిత్రంగా చూడటం మొదలు పెడుతున్నారు నేటి రోజుల్లో జనాలు. జనాలలో అంతలా మార్పు వచ్చింది అని చెప్పాలి  ఇక కాస్తో కూస్తో తాగి సర్దుకు పోవడం కాదు ఫుల్లుగా పీకల వరకూ మద్యం తాగి తూలుతూ ఉండడాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు జనాలు. దీంతో ఇక మద్యానికి బానిస అవ్వడం కారణంగా చివరికి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే సాధారణంగా కొంతమంది మద్యం తాగిన తర్వాత కూడా సాదాసీదాగానే ఉంటారు.  కానీ మరికొంతమంది మాత్రం ఒక పెగ్గు లోపలికి వెల్లింది అంతే చాలు చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం వంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. మరికొంతమంది విచక్షణ కోల్పోయి తాము ఏం చేస్తున్నామో కూడా ఆలోచించుకో లేని విధంగా ఉంటారు. ఇలా ఇటీవలి కాలంలో ఏకంగా మద్యం మత్తులో ఒక వ్యక్తి బిర్యాని తో పాటు బంగారు నగలను కూడా తినేసిన ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా మద్యం గ్లాస్ లో పోసుకుని తర్వాత వాటర్ కలుపుకోవడం చేస్తూ ఉంటారు.

 కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం మద్యం మత్తులో వాటర్ కి బదులు యాసిడ్ కలుపుకున్నాడు. దీంతో జరగరాని ఘోరం జరిగిపోయింది. చివరికి ఆరోగ్యం విషమించి ఆసుపత్రి పాలయ్యాడు.  అక్కడ డాక్టర్లు ఎంత ప్రయత్నించినా అతని కాపాడలేకపోయారు. చివరికి చికిత్స పొందుతూ సదరు వ్యక్తి మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యంలో నీళ్లకు బదులుగా యాసిడ్ కలుపుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: