ఆసుపత్రి బెడ్ పై క్షుద్రపూజలు.. ఇంతకీ ఏం జరిగిందంటే?

praveen
ప్రపంచం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంటే ఇప్పటికీ కొంతమంది మాత్రం మూఢనమ్మకాలని పట్టుకుని వేలాడుతున్నారు . ఇంకా మంత్రాలు తాంత్రిక పూజలు అంటూ ఎన్నో చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మంత్రాలకు చింతకాయలు రాలుతాయ్ అని  ఇంకా నమ్ముతూనే ఉన్నారు ఎంతోమంది.  ఇక కొన్ని కొన్ని సార్లు ఇలాంటి మూఢనమ్మకాలతో జనాలు విచిత్రంగా ప్రవర్తించే తీరు ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇక మరికొంతమంది కేటుగాళ్లు జనాల మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుంటూ డబ్బులు దండుకుంటున్న పరిస్థితి ఏర్పడుతుంది అన్న విషయం తెలిసిందే.

 ఇక మరికొంతమంది క్షుద్ర పూజల పేరుతో నమ్మించి భయబ్రాంతులకు గురి చేసి చివరికి ఆడపిల్లలపై అత్యాచారాలు పాల్పడుతున్న ఘటనలు కూడా అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయ్. ఇటీవలే మధ్యప్రదేశ్లోని అశోక్ నగర్ జిల్లాలో కూడా ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కచ్చియా భాయ్ అహిర్వర్ అనే 65 ఏళ్ల మహిళ ఇటీవల పెళ్లి కి వెళ్ళింది. తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న మరికొంతమంది సదరు మహిళకు గాలి సోకిందని తాంత్రిక పూజలు చేయించాలి కుటుంబసభ్యులను భయపెట్టారు.

 ఈ క్రమంలోనే తమకు తెలిసిన తాంత్రికుడు ఉన్నాడు అంటూ చెప్పారు. తర్వాత అతడిని నేరుగా హాస్పిటల్కి రప్పించారు. ఈ క్రమంలోనే డాక్టర్లు లేని సమయం చూసి తాంత్రికుడు మంత్రాలు చదవడం మొదలు పెట్టాడు. బెడ్ మీద మహిళను ముందు కూర్చోబెట్టి  మంత్రాలు చదువుతూ ముఖంపై నీళ్లు చల్లాడు. కొంతమంది ఈ ఘటనను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ఘటనపై అటు ఆస్పత్రి వైద్య అధికారులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఇక ఉన్నతాధికారులు సైతం ఈ ఘటనపై వెంటనే వివరణ ఇవ్వాలంటూ ఆస్పత్రి అధికారులను కోరారు. ఈ ఘటన సంచలనం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: