లేచిపోదాం రా అంటూ పిలిచిన ప్రియురాలు.. వెళ్ళాక ఊహించని ట్విస్ట్?

praveen
ప్రతి ఒక్కరి జీవితంలో అనుకోకుండా ఏర్పడిన కొన్ని పరిచయాలు చివరికి అక్రమ సంబంధాలకు దారి తీస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ అక్రమ సంబంధాల కారణంగా సాఫీగా ఉన్న జీవితంలో ఊహించని సమస్యలు కూడా వచ్చి పడుతుంటాయి. ఎంతో అన్యోన్యంగా ఉన్న భార్య భర్తలు కాస్త అక్రమ సంబంధాల కారణంగా దూరమవ్వడం జరుగుతూ ఉంటుంది. అంతే కాదు ఒకరంటే ఒకరికి ప్రాణంగా ప్రేమించే భార్య భర్తల మధ్య పగ ప్రతీకారాలు కూడా పెరిగి పోతూ ఉంటాయి. ఈ అక్రమ సంబంధాలు హత్యలు ఆత్మహత్యలకు దారితీస్తాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. మహిళతో అతనికి ఏర్పడిన పరిచయం చివరికి లీగల్ రిలేషన్ షిప్ కి దారితీసింది. తర్వాత అతను ఊహించని రీతిలో సమస్యలు ఎదుర్కొన్నాడు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లో వెలుగులోకి వచ్చింది. చత్తీస్గడ్ జష్పూర్ పరిధిలోని నారాయణపూర్ కు చెందిన సోను యాదవ్ అనే వ్యక్తికి సమీప ప్రాంతానికి చెందిన ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తకు తెలియకుండా సదరు మహిళ ప్రియుడు సోను యాదవ్ ను తరచూ కలుస్తూ ఉండేది.

 కానీ కొన్ని రోజుల క్రితమే భర్త లలిత చౌహాన్కు భార్య అక్రమ సంబంధం గురించి తెలిసింది. దీంతో భార్యను గట్టిగా మందలించాడు. ఇంకోసారి ఇలాంటివి జరుగుతున్నట్లు తెలిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.  సోను యాదవ్ పై దాడి చేసి తన భార్య జోలికి రావద్దు అని హెచ్చరించాడు. అయితే సోను యాదవ్ మాత్రం తన ప్రియురాలిని కలిసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో ఈ నెల 24వ తేదీన మహిళను కలిసి కొత్త సిమ్ కొనిచ్చాడు. భర్తకు తెలియకుండా ఫోన్ మాట్లాడుకునేవారు. ఈ విషయం కూడా భర్తకు తెలిసింది. దీంతో సోను యాదవ్ ను అంతమొందించాలని కుట్ర పన్ని భార్యకు చెప్పి ఆమెతో సోను యాదవ్ ఫోన్ చేయించాడు. ఇక 23వ తేదీన రాత్రి సమయంలో సదరు మహిళ  చెప్పిన  ప్లేస్ కి బైక్పై వెళ్ళాడు. దీంతో అక్కడే ఉన్న రామ్ చౌహాన్ అతడి భార్య కలిసి సోను యాదవ్ పై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: