దారుణం.. స్కూల్ టీచర్ పై రేప్?

praveen
అత్యాచారం చేసిన వారికి కోర్టులు ఉరిశిక్ష విధిస్తూ ఉన్నాయి. మరోవైపు ఇక మహిళలపై అత్యాచారం చేసిన వారిని ఏకంగా పోలీసులు ఎన్ కౌంటర్ కూడా చేస్తున్నారు. కానీ ఇవన్నీ అటు కామాంధుల్లో మాత్రం ఎక్కడా భయం తెప్పించడం లేదు. ఆడ పిల్లల పై అత్యాచారం చేస్తే కఠిన శిక్షలు పడతాయని.. చివరికి ప్రాణాలు కూడా పోతాయి అని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. రోజు రోజుకి మానవ మృగాలుగా మారిపోతున్న మనుషులు ఆడపిల్ల కనిపిస్తే చాలు దారుణ అత్యాచారాలకు పాల్పడుతున్నారు. నెలలు నిండని పసికందుల నుంచి పండు ముసలి వరకూ ఎవరినీ వదిలిపెట్టడం లేదు.  దీంతో ఈ లోకంలో ఆడపిల్లగా పుట్టడమే మేము చేసిన పాపమా అనే ప్రతి ఒక ఆడపిల్ల బాధ పడే పరిస్థితి ఏర్పడుతోంది.


 ఇటీవలే మహారాష్ట్రలో ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబైలోని రాయగడ్ జిల్లాలో  గుజరాత్కు చెందిన 21 ఏళ్ల టీచర్ పై ఇద్దరు కామాంధులు దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా ఒక్కసారికి ఉలిక్కిపడేలా చేసింది. అయితే బాధితురాలికి ఐదు నెలల క్రితం నిందితులలో ఒకరైన ఇద్రీస్ ఖాన్ సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. పరిచయం స్నేహంగా మారి పోయింది. ఇటీవల ఇద్రీస్  తన పుట్టిన రోజుకి  టీచరునీ కూడా ఆహ్వానించాడు. ఈ క్రమంలోనే స్నేహితుని ఆహ్వానాన్ని మన్నించినా బాధితురాలు పుట్టినరోజు వేడుకకు వచ్చేందుకు బయలుదేరింది. బాంద్రా రైల్వే స్టేషన్ లో దిగింది.


 అక్కడే తన స్నేహితుడితో కలిసి సదరు యువతిని కలుసుకున్నారు  ఇద్రీస్ ఖాన్. ఇక టాక్సీలో ఆమెను తలోజా వద్దకు తీసుకువచ్చి చివరికి అక్కడ స్నేహితుడి ప్లాట్ లో సదరు మహిళ పై అత్యాచారం చేశాడూ. అనంతరం జహీర్ అలీ కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కామాంధుల నుంచి తప్పించుకున్న సదరు యువతి పోలీస్ కంట్రోల్ రూమ్ కు చేరి విషయాన్ని తెలియజేసింది. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు వివరాలను సేకరించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఇక తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: