ప్రేమ పెళ్లి.. కానీ ట్విస్ట్ ఇచ్చిన భార్య?

praveen
యువతీ యువకుల మధ్య ప్రేమ పుట్టడం కామన్. కానీ ఆ ప్రేమలో ఎంత నిజాయితీ వుంది ఎంతలా అర్థం చేసుకునే గుణం ఉంది అన్నది ఎంతో ముఖ్యం. ఎలాంటి కష్టం వచ్చినా ఒకరికి ఒకరు తోడుగా నిలబడేంత ప్రేమ ఉందా లేదా అనేది చాలా ముఖ్యం. అయితే ఇటీవలి కాలంలో కొంతమంది ప్రేమలో మునిగి తేలుతూ ఆ తర్వాత పెళ్లితో ఒక్కటవుతున్నారు. కానీ పెళ్లి తర్వాత సీన్ రివర్స్ అవుతుంది. ప్రేమించుకునే సమయంలో ఒకరి మనసును ఒకరు అర్థం  చేసుకోకపోవడం తో ఇక పెళ్లి తర్వాత కొన్నాళ్లకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తటం లాంటివి కూడా జరుగుతున్నాయి. చివరికి ప్రేమ పెళ్లిళ్లు ఎన్నో పెటాకులు గా మారిపోతున్న ఘటనలో కూడా వెలుగులోకి వస్తున్నాయి.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు ఒకరు లేకుండా మరొకరు బ్రతకలేరు అని భావించారు. దీంతో ఇక పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉండాలి అనుకున్నారు. ప్రేమను గెలిపించుకుని పెళ్ళి చేసుకున్నారు. కానీ ఆ తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. భర్త డబ్బులు సంపాదించినన్ని రోజులు ఎంతో ప్రేమగా ఉన్న భార్య.. భర్త అనారోగ్యంతో మంచానపడగానే ప్లేట్ ఫిరాయించింది. వీడిని ఎందుకు పెళ్లి చేసుకున్నానురా దేవుడా అంటూ లోలోపల అనుకోవడం స్టార్ట్ చేసింది.  ఒకానొక రోజు చివరికి భర్తను వదిలేసి తన దారి తాను చూసుకుంది భార్య. ఈ ఈ క్రమంలోనే  ఎంతగానో మనస్థాపం చెందిన భర్త తన బాధను అర్బన్ స్పందన లో ఫిర్యాదు చేశాడు.

 గుంటూరు జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 2001 సంవత్సరంలో ఫైనాన్స్ కన్సల్టెంట్గా వ్యాపారం చేశాడు సదరు వ్యక్తి. ఇక అదే సమయంలో అతనికి ఒక మహిళ పరిచయమైంది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇక పెళ్లి చేసుకుని జీవితాంతం హాయిగా ఉండాలనుకున్నాడు. ఇక పెళ్లి తర్వాత వీరి ప్రేమకు ప్రతిరూపంగా ఒక పాప కూడా జన్మించింది. ఈ క్రమంలోనే భర్త పేరు మీద భార్య ఆమె తమ్ముడికి 48 లక్షల రుణం ఇప్పించింది. అంతలో ఊహించని ఘటన. 2013లో సదరు వ్యక్తి పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమైయ్యాడు. ఎలాంటి వ్యాపారం చేయలేకపోవడంతో ఆదాయం కూడా లేకుండా పోయింది. ఇక అప్పటినుంచి భర్తను కాదని వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటూ వచ్చిన భార్య చివరికి కుమార్తెను తీసుకుని భర్తను వదిలేసి వెళ్ళిపోయింది. దీంతో భార్య తో తనకు విడాకులు ఇప్పించి కుమార్తెను అప్పగించాలంటూ స్పందన కార్యక్రమంలో బాధితుడు ఫిర్యాదు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: