వీడు మనిషే కాదు.. ఎవరైనా ఇలా చేస్తారా?

praveen
ఏంటి లోకం తీరు.. ఎటు పోతుంది మనిషి ఆలోచన.. నేటి రోజుల్లో వెలుగులోకి వచ్చిన ఘటనలు చూస్తుంటే సభ్యసమాజం తలదించుకుంటుంది. సృష్టికి మూలమైన ఆడపిల్లకు నేటి సమాజంలో కనీస రక్షణ లేకుండా పోయింది మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనుషులు అదే మానవత్వాన్ని మరిచి కామంతో ఊగిపోతూ దారుణంగా  వ్యవహరిస్తున్న ఘటనలు రోజురోజుకీ వెలుగులోకి వస్తున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. దీంతో రోజురోజుకీ ఎన్నో దారుణ ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆడపిల్ల కనిపిస్తే చాలు దారుణంగా మీద పడి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అంతటితో ఆగకుండా దారుణంగా హత్యలకు సైతం పాల్పడుతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి.

 అభం శుభం తెలియని చిన్నారులను సైతం వదలడంలేదు.  ఇటీవలి కాలంలో ఎంతో మంది చిన్నారులు కామాంధులు అత్యాచారానికి గురై  ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. ఇటీవలే పశ్చిమగోదావరి జిల్లాలో కూడా ఇలాంటి దారుణం సంఘటన వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరగగా బాలికను ఏలూరులోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఇక ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది అన్నది అర్ధమవుతుంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. అయితే అత్యాచారానికి గురైన ఐదేళ్ల చిన్నారిపై శ్రీకాంత్ అనే యువకుడు ముద్దు చేస్తూ  సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది.

 అయితే కామాంధుడు ఆ ఐదేళ్ళ చిన్నారిని ఎత్తుకుని పొదల్లోకి తీసుకు వెళ్తున్న సమయంలో  బాలిక బంధువు ఒకరు చూసి చివరికి తల్లిదండ్రులకు సమాచారం అందించింది. అయితే అప్పటికే కూతురు కనిపించడం లేదని కంగారు పడిపోయిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాలలో వెదకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే  శ్రీకాంత్ బాలికను తీసుకెళ్లినట్లు బంధువు చెప్పడంతో ఇక ఆ తర్వాత ఇంటికి వచ్చిన చిన్నారి బాధపడుతూ ఉండడాన్ని గమనించింది తల్లి. దీంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఇక పరీక్షించిన వైద్యులు అత్యాచారం జరిగింది అనే విషయాన్ని తెలిపారు. ఈ విషయంపై తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: