ఓరి నీచుడా.. జాతకం చూడమంటే.. ఇలా చేస్తావా?

praveen
ఇటీవలి కాలంలో ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గడం లేదు అని చెప్పాలి. మహిళలకు రక్షణ కల్పించేందుకు ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా అవి నేరస్థులకు చుట్టాలు గా మారిపోతున్నాయి తప్ప సత్వరంగా శిక్షలు పడడం లేదు  అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక సభ్యసమాజంలో కామంతో కళ్లు మూసుకుపోతున్న ఎంతోమంది ఆడపిల్ల కనిపిస్తేచాలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మానవ మృగాలుగా మారిపోయి దారుణంగా అత్యాచారం హత్యకు సైతం చేస్తూ యథేచ్ఛగా సభ్యసమాజంలో తిరుగుతున్నారు.  ఆడపిల్ల ఇంటి నుంచి కాలు బయట పెట్టాలని అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది నేటి రోజుల్లో.

 అంతేకాదు రోజురోజుకు ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచారాల ఘటనలు పెరిగిపోతు ఉండటం చూస్తూ ఉంటే ఆడపిల్లగా పుట్టడమే పాపమా అని ప్రతి ఆడపిల్ల బాధ పడుతుంది. పరాయి వాళ్ల నుంచే కాదు సొంత వాళ్ల నుంచి కూడా లైంగిక వేధింపులు ఎదురవుతుంటే ఆడపిల్లలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు  చెప్పాలి. ఇంక మరి కొంతమంది బురిడీ బాబా ల వేషంలో ఎంతో మంది ఆడపిల్లలపై అత్యాచారాలు పాల్పడిన ఘటనలో కూడా వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. జాతకం చూపించుకోవడానికి తన దగ్గరికి వచ్చిన ఒక బాలికపై పూజారి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.

 ఈ దారుణ ఘటన కేరళలోని కొట్టాయం లో వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు ఇటీవలే బాలిక జాతకం చూపించేందుకు ఆలయ అర్చకుడు శిరీష్ వద్దకు తీసుకు వెళ్ళారు.   ప్రతి రోజు దేవుడికి పూజలు చేసే ఆ పూజారి దేవుడు సన్నిధిలోనే కామం తో ఊగిపోయాడు. ఇక తల్లిదండ్రులను అక్కడే ఉంచి  బాలికను వేరే గదికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక బాలిక తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పడంతో  తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: