నో.. నేను మగాడిలా ఉండలేను.. చివరికి?

praveen
ఆధునిక జీవనశైలి లోకి అడుగుపెడుతున్న మనిషి ఆలోచనా తీరులో మాత్రం ఇంకా మార్పు రావడంలేదు. కొన్ని విషయాలలో చిన్న చూపుతోనే ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ట్రాన్స్ జెండర్స్ ను చూస్తే ఇంకా అసహ్యించుకునే జనాలు ఎంతోమంది కనిపిస్తూనే ఉంటారు. ఓవైపు ఎంతోమంది ట్రాన్స్ జెండర్స్ సభ్య సమాజంలో గౌరవంగా బతకడానికి ప్రయత్నిస్తూ ఉంటే అటు ఆధునిక సమాజంలో బ్రతుకుతున్న మనుషులు మాత్రం ట్రాన్స్జెండర్ లు అసలు మనుషులే కాదేమో అన్న విధంగా అసహ్యంగా చూడటం వంటివి చేస్తూ ఉంటారు.

ఏదైనా శుభ కార్యాలు జరిగినప్పుడు ట్రాన్స్ జెండర్ లతో ఆశీర్వాదం తీసుకుంటే మంచిది అనుకునే వారు కొంతమంది అయితే.. ట్రాన్స్ జెండర్ లు ఎప్పుడూ డబ్బు కోసం ఏదైనా పని చేస్తారు అని నీచంగా చూసే వారు మరికొంతమంది. ఏదేమైనా అడుగడుగునా ట్రాన్స్జెండర్ లు  ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ పై జనాల్లో ఎలాంటి ఆలోచన ఉంది అన్న విషయానికి ఈ ఘటన నిలువుటద్దంగా మారిపోయింది. తనకు అబ్బాయి గా ఉండడం ఇష్టం లేదని ట్రాన్స్ జెండర్ గా మారిపోతాను అంటూ కొడుకు చెప్పాడో లేదో  తల్లి కన్న పేగు బంధాన్ని మరిచి  దారుణంగా కన్నకొడుకును హతమార్చింది.

 చెన్నైలోని సేలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.. పుట్టుకతోనే ఎంతోమంది హార్మోన్ల లోపం కారణంగా మగవారిలా ఉన్నప్పటికీ ఆడవారిలా మారాలని భావిస్తూ ఉంటారు. సేలం పోలీస్స్టేషన్ పరిధిలో ఉండే నవీన్ అనే యువకుడు ట్రాన్స్ జెండర్ గా మారాలని ఉంది అంటూ తల్లి ఉమాదేవితో తరచూ చెబుతూ ఉండేవాడు. తల్లి ఎంత మందలించినా అటు నవీన్ మాత్రం తన పేరును అక్షిత గా మార్చుకుని ట్రాన్సజెండర్ గా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడ్డాడు. అయితే కొడుకు తీరుతో విసిగి పోయిన తల్లి ఐదుగురు సహాయంతో అతనిపై దారుణంగా దాడి చేసి చంపేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టగా ఇక హత్య చేసింది  సొంత తల్లి అనే విషయం పడింది. ఈ క్రమంలోనే తల్లితో పాటు సహకరించిన మరో ఐదుగురు నిందితులను కూడా అరెస్టు చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

No

సంబంధిత వార్తలు: