మైనర్ ప్రియుడితో కలిసి..తల్లిని చంపిన మైనర్ బాలిక..!
హైదరాబాద్ మహానగరంలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్మెట్లో ఈసంఘటన చోటు చేసుకుంది. చింతల్మెట్లో నివాసం ఉండే యాదయ్య, యాదయ్య దంపతులకు ఇద్దరు కూతుర్లు. అందులో మొదటి కూతురుకు పెళ్లి చేశారు. రెండవ కూతురు (17) చదువుకుంటుంది. గత కొంతకాలం నుంచి రామ్ అనే యువకునితో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తుంది. అతడు తరుచూ ఇంటికి వచ్చి పోతుంటాడు. ఇది గమనించిన తల్లి.. ఆ యువకుడు ఇంటికి రావడం వల్ల చుట్టూ పక్కల వారు పలువిధాలుగా అనుకుంటారు.
ఇంటికి రావద్దని చెప్పడంతో ఆమె ఆగ్రహానికి గురైంది. తల్లి తనను తిట్టిందనే విషయాన్ని మనసులో పెట్టుకొని ఎలాగైన కక్ష తీర్చుకోవాలని ప్రియుడికి చెప్పింది. ప్రియుడు ఇంటికి వద్దకు చేరుకొని ఇద్దరు కలిసి చున్నిచుట్టి హత్యచేశారు. వారు హత్యకు పాల్పడిన సమయంలో ఇంట్లో ఎవరు లేరు. కిందపడిపోయిందని స్థానికులను నమ్మబలికించింది మైనర్ బాలిక. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు బాలికపై అనుమానం రావడంతో విచారించారు. దీంతో అసలు నిజం ఒప్పుకుంది. రామ్తో కలిసి తానే హత్య చేసినట్టు నిజం నిర్థారణ అయింది. కన్న తల్లిని కడతేర్చడానికి ఆ కూతురుకు మనసు ఎలా వచ్చిందని పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. కొంతమంది అయితే ఇలాంటి వారిని అసలు వదిలిపెట్టవద్దు. వారి ప్రేమ కోసం నిండు ప్రాణాలు బలిఅవుతాయా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ బాలిక తండ్రి, కుటుంబ సభ్యులందరూ శ్లోక సంద్రంలో మునిగిపోయారు. ఇద్దరు మైనర్లే కావడంతో జువైనల్ హోంకు తరలించనున్నట్టు పోలీసులు వెల్లడించారు.