కార్పొరేటర్ భర్తను చెప్పుతో వాయించిన మహిళా.. ఎందుకో తెలుసా..?
ఓ కార్పొరేటర్ భర్త చేసిన వీరంగం అంత ఇంత కాదు. ప్రజాప్రతినిధులు అయితే కొమ్ములుంటాయనే విధంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వారిలో కొంతమందిని లొంగదీసుకొని మరీ లైంగిక కార్యకలాపాలు నడిపిస్తున్నాడు. ఈ తతంగం అంతా నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్లో ఓ కార్పొరేటర్ భర్తను చెప్పుతో చెడామడా వాయించింది మహిళ. తన కూతురితో వివాహ సంబంధం కొనసాగించి తన ఇంట్లో పెద్ద చిచ్చు పెట్టాడని.. చెప్పుతో చెటాపటా కొట్టింది.
నిజామాబాద్ కార్పొరేటర్ భర్త ఆకుల శ్రీను తన కూతురును మోసం చేశాడని.. ఇంటి ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. రాత్రి తమ కూతురును తీసుకెళ్లిన కార్పొరేటర్ భర్తను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నామని బాధితులు వెల్లడించారు. గతంలో పలుమార్లు తమ కూతురు పట్ల ఈ విధంగా ప్రవర్తించకూడదు.. వదిలిపెట్టాలని మందలించినా తన తీరు మాత్రం మార్చుకోలేదని వాపోతున్నారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆందోళన చేశారు.
తన భార్యకు విడాకులు ఇచ్చి మా కూతురును పెళ్లి చేసుకుంటే మేము ఒప్పుకుంటాం. కానీ పెళ్లి చేసుకోకుండా ఇలా వ్యవహరించడం ఎంతవరకు న్యాయం. పెళ్లి కావాల్సిన ఆడపిల్ల పట్ల ఇలాంటి తతంగానికి పాల్పడితే మా అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారని వాపోయారు. ఆ యువతి తల్లిదండ్రులు కార్పొరేటర్ భర్తపై దాడి చేసిన సమయంలో అతని భార్య, పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. ఇరుగు పొరుగు వారు చెప్పినా వారు విని పరిస్థితిలో లేకున్నారు. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఏదైనా సమస్య ఉంటే కేసు పెట్టి పరిష్కరించుకోవాలి. ఇలా దాడి చేసి గొడవ చేయడం వల్ల న్యాయం జరగదని పోలీసులు ఆ కుటుంబానికి సర్ది చెప్పారు. నిజామాబాద్లో ఈఘటన సంచలనంగా మారింది. ఎవరూ చూసినా దీని గురించే చర్చించుకోవడం గమనార్హం. పలువురు కార్పొరేటర్ భర్త వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధి ఇలా చేస్తే ఎలా అని చర్చించుకుంటున్నారు.