కన్నపిల్లలను కడతేర్చిన కసాయి తల్లి
చంపిన తరువాత తన తమ్ముడికి ఫోన్ చేసి తన ఇద్దరు పిల్లలను చంపినట్లు చెప్పింది. షాక్ కి గురైన ఆమె తమ్ముడు ఇంటికి వచ్చి చూడగా ఆ ఇద్దరు చిన్నారులు విగత జీవులుగా పడి ఉన్నారు. వెంటనే హాస్పిటల్ కి తరలించారు. కానీ అప్పటికే చనిపోయి ఉండడం తో లాభం లేక పోయింది. వెంటనే ఈ విషయాన్నీ పోలీసులకు గ్రామస్తులు తెలియ జేశారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే లక్ష్మి అనూష తో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం కి చెందిన పూలేటి రాములు అనే వ్యక్తి తో వివాహం జరిగింది.
ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత రాములు చనిపోవడంతో లక్ష్మి ఇద్దరు పిల్లలతో కంబాల చెరువు లోని మల్లన్నపేటలో నివాసం ఉంటోంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం ఆమె తన కుమార్తె ను కుమారుడిని చిత్ర హింసలకు గురిచేసేది అని చెప్పారు. శనివారం కూడా ఇద్దరు పిల్లలను రక్తమోచేట్లు కొట్టిందని చెప్పారు. అయితే లక్ష్మి మాత్రం తాను వారిని పోషించలేక ఆలా చేసినట్లు పోలీసుల విచారణలో తెలిపింది. పొలిసు అధికారులు మాత్రం పలు కోణాలలో కేసును విచారణ చేస్తున్నారు. పోషించలేక పోతే ఏ అనాధాశ్రమాల్లో నో ఎవరికన్నా దత్తతో ఇవ్వక నిండు ప్రాణాలను తీసావు అని స్థానికులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. పోషించలేక పోతే వారిని చంపడమొక్కటే పరిష్కారమా ...?
కానీ పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ లో విస్తు పోయే నిజాలు బయటపడ్డాయి . లక్ష్మి అనూష ఓ బ్యూటీ పార్లర్ ను నడుపుతోందని. ఆమెకు ఓ వ్యక్తితో సహజీవనం ఉందని. ఆ రిలేషన్ షిప్ కారణంగానే పిల్లలను కడతేర్చి ఉండవచ్చని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.