మహిళతో వ్యక్తి సహజీవనం... ఆతర్వాత ఏమి జరిగిందంటే...?
ఏ పని ఉన్నా బాబులాల్తో చేయించుకునేది గులాబ్దేవి. ఈ సమయంలోనే ఇరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఆ ప్రేమ కాస్త చిగురించింది. తనకు భర్త లేకపోవడంతో మగతోడుంటాడుకొని సహజీవనం చేసింది. కొద్ది రోజుల పాటు వీరి జీవితం సజావుగా సాగింది. ఇంతలోనే చిన్న చిన్న గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ గొడవ కాస్త పెద్దగా మారి గులాబ్దేవి హత్యకు గురయ్యే వరకు వెళ్లింది. 2011లో బాబులాల్ సొంతంగా రూ. 22 లక్షలతో ఓ ఇల్లు కొన్నాడు. అతని వద్ద సరిపడా డబ్బులు లేకపోవడంతో గులాబ్దేవి వద్ద రూ.5లక్షలు తీసుకున్నాడు. తమ కుటుంబంలో ఒకరిని దత్తత తీసుకోవాలని గత రెండు నెలలుగా చెబుతూ వచ్చింది. దీని తన ఆస్తి తనకు దక్కకుండా పోతుందని భావించాడు బాబులాల్.
ఆమెను అడ్డు తొలగించుకోవడం ఉత్తమం అని నిర్ణయించుకున్నాడు. గులాబ్ను హత్య చేయడానికి నాలుగుసార్లు ప్రయత్నం చేసి విఫలం చెందాడు. తాను ఒక్కడినే హత్య చేయడం కుదరదు అని ఓ కొలిక్కి వచ్చి రూ.2.5లక్షలకు ఓ ముఠాతో ఒప్పందం చేసుకున్నాడు. ఏవేవో మాయమాటలు నమ్మబలికి ఆమెను ఢిల్లీ నుంచి జైపూర్కు తరలివెళ్లారు. అక్కడ మరో ఐదుగురితో కలిసి ఆమెను హతమార్చాడు. హత్య చేశాక శవాన్ని ఓ కల్వర్ట్లో పడేశారు. ఆ హత్యను ఆత్మహత్యగా మార్చే ప్రయత్నం చేశాడు. ఆమె బ్యాగ్లో ఓ సూసైడ్ నోట్ రాసిపెట్టాడు. సోదరులతో ఆస్తి గొడవ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు బాబులాల్ రాశాడు. పోలీసులకు అనుమానం విచారించారు. విచారణలో అసలు విషయాలను వెల్లడించాడు. బాబులాల్తో పాటు హత్యకు సహకరించిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు.