పెళ్ళైనా నెలకే అసలు నిజం తెలిసింది.. చివరికి ఒక యువతి ఆత్మహత్య?

praveen
ప్రతి యువతి ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకుని కోటి ఆశలతో అత్తవారింట్లో అడుగుపెడుతుంది.  భర్తతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఎన్నో కలలు కంటుంది. కానీ ఇక్కడ ఓ యువతికి మాత్రం పెళ్లి శాపంగా మారి పోయింది.  ఆ యువతి కాళ్ళ పారాణి కూడా ఆరనే లేదు అప్పుడే యువతి మెడకు ఉరి తాడు బిగుసుకుంది.  ఓ తండ్రి అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురి ప్రాణం భర్త కారణంగా గాల్లో కలిసిపోయింది. పెళ్లి తర్వాత వైవాహిక జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది అని కలలుకన్న ఆ యువతికి కన్నీళ్లే మిగిలాయి. మెట్టినింట అడుగుపెట్టిన కొన్ని రోజుల్లోనే అత్తింటి అసలు బాగోతం బయటపడింది.

 అదనపు కట్నం తీసుకురావాలని అంటూ వేధించడం మొదలుపెట్టారు. కష్ట సుఖాల్లో తోడు ఉండాల్సిన భర్త చివరికి అదనపు కట్నం కోసం అత్త మామ ఆడపడుచులకు వత్తాసు పలికేవాడు. దీంతో భర్తే లోకంగా అత్త వారి ఇంట్లో అడుగుపెట్టిన ఆ యువతికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. చివరికి ఓ రోజు ఏకంగా ఆ యువతిని పుట్టింట్లో వదిలిపెట్టి వెళ్లిపోయాడు భర్త. ఇలా అత్తింట్లో వేధింపులు పుట్టింట్లో నవ్వులపాలు అవుతుందని మనస్థాపం చెందిన ఆ యువతి పెళ్లయిన నెల రోజులకే ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కడపలో ఘటన వెలుగులోకి వచ్చింది. నెహ్రూ నగర్ కు చెందిన ఝాన్సీకి రాజంపేట మండలంకు చెందిన రాధాకృష్ణతో ఆగస్టు 15న వివాహం జరిగింది.

 కట్నకానుకల కింద ఏకంగా వరుడికి 20 లక్షలు ముట్ట చెప్పారు ఝాన్సీ తల్లిదండ్రి. రాధాకృష్ణ బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. ఝాన్సీ  కూడా బాగా చదువుకొని  ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేసేది. వివాహం జరిగిన తర్వాత ఉద్యోగం మానేసి ఇంటి దగ్గరే ఉంటుంది. అయితే వివాహం జరిగిన కొన్ని రోజుల్లోనే అత్తింటి వారి అసలు స్వరూపం బయట పడింది. అదనపు కట్నం తీసుకురావాలని అంటూ భర్త అత్తమామలు వేధించడం మొదలు పెట్టారు. 70లక్షలు తీసుకొస్తేనే ఇంటికి రావాలంటూ పుట్టింట్లో దింపేసారు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినప్పటికీ మార్పు రాలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి చివరికి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: