ఐదేళ్ల క‌న్న‌ కూతురిపై తండ్రి పైశాచిక‌త్వం..

Paloji Vinay
రోజురోజుకు స‌మాజం ఎటు వైపు వెళ్తుందో అర్థం కావ‌డం లేదు. వావివ‌రస‌లు మ‌రిచి పైశాచిక‌త్వాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఆడ‌పిల్ల‌లు ఈ భూమిమీద స్వేచ్ఛ‌గా బ‌తుక‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. చిన్న పిల్ల‌లు, ముస‌లి వారు అనే తేడా లేకుండా కామంతో క‌ళ్లు మూసుకుపోయిన కొంద‌రు ప‌శువులు వారిపై అత్యాచారాల‌కు పాల్ప‌డుతున్నారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు రోజు జ‌రుగుతున్నాయి. ఇలాంటి దారుణ‌మైన‌ సంఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. త‌న‌కు ర‌క్ష‌గా ఉండాల్సిన క‌న్న తండ్రే ఆమె పాలిట రాక్ష‌సుడిగా మారాడు.. కూతురిపై లైంగిక‌దాడి చేసి వాంఛ తీర్చుకున్నాడు. రెండున్న‌ర నెల‌ల కింద జ‌రిగిన ఈ దారుణం ఇప్పుడు బ‌హిర్గతం అయింది.


   కూతురు ఆరోగ్యం బాగాలేద‌ని  గుర్తించిన చిన్నారి తల్లి ఆస్ప‌త్రికి తీసుకెళ్లింది. అక్క‌డ వైద్యులు ప‌రీక్షించి మూత్ర సంబంధ వ్యాధి అయి ఉంటుంద‌ని మందులు ఇచ్చి పంపించేశారు. అయితే, ఎంత‌కి అరోగ్యం కుదుట‌ప‌డ‌క‌పోవ‌డంతో త‌ల్లి ఆ చిన్నారిని ఆరా తీసింది. వ‌చ్చి రాని మాట‌ల‌తో క‌సాయి తండ్రి చేసిన ఘోరాన్ని చెప్ప‌డంతో దారుణం వెలుగులోకి వ‌చ్చింది. స‌భ్య స‌మాజి త‌ల దించుకునేలా చేసిన ఈ దారుణం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నున్న పోలీస్ స్టేష‌న్ పిరిధిలో చోటు చేసుకుంది.

తీవ్రస్థాయిలో లైంగిక వేధింపులుతో పాటు అత్యాచారానికి పాల్ప‌డిన ఆ నీచున్ని భార్య నిల‌దీయ‌డంత పొంత‌న లేని స‌మాధానం చెప్పాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకోవ‌డంతో ఇంట్లో నుంచి పారిపోయాడు అత‌డు. మ‌ళ్లీ ఈ నెల 4న వ తేదిన ఇంటికి వ‌చ్చి కూతురును తీసుకువెళ్లిపోతుండ‌గా కంట్రోల్ రూంకు స‌మాచారం అందించ‌డంతో అక్క‌డి నుంచి పారిపోయాడు ఆ క‌సాయి తండ్రి. దీంతో చిన్నారి త‌ల్లి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు విజ‌య‌వాడ దిశ పోలీసు స్టేష‌న్ నిందితునిపై కేసులు న‌మోద చేశారు. వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం పాపను విజ‌య‌వాడ పాత ప్ర‌భుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. నిందితుడిని బుధ‌వారం రోజు పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హ‌జ‌రు ప‌రిచారు. దీంతో అత‌డిని రిమాండ్‌కు త‌ర‌లించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: