ఫ్రెండ్షిప్ డే రోజే.. ఎంత దారుణం జరిగింది?

praveen
ప్రతి మనిషి జీవితంలో అన్ని బంధాల కంటే స్నేహబంధం ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే.. ఎలాంటి సమస్యల్లో అయినా తోడు నీడగా నిలిచేది ఒక స్నేహితుడు మాత్రమే అని అంటూ ఉంటారు..  అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా స్నేహితులందరి స్నేహ బంధానికి ప్రతీకగా ఆగస్టు మొదటి ఆదివారం రోజున ఫ్రెండ్షిప్ డే అంటూ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ స్నేహితుల దినోత్సవం రోజే దారుణ ఘటన జరిగి పోయింది. ఏకంగా  కష్టసుఖాల్లో అండగా ఉంటాడు అనుకున్న స్నేహితుడె చివరికి కాలయముడుగా మారిపోయి హతమార్చాడు. ఈ దారుణ ఘటన పాట్నాలో వెలుగులోకి వచ్చింది.


 గంజాయికి బానిసగా మారిన వ్యక్తి  ఓ రోజు ఇక గంజాయి కొనుక్కోవాలి అంటూ తన స్నేహితుడిని డబ్బులు అడిగాడు. కానీ ప్రస్తుతం తన వద్ద లేవు అంటూ స్నేహితుడు బదులిచ్చాడు. దీంతో గంజాయికి బానిసగా మారిన వ్యక్తి ఉన్మాదిగా మారి పోయాడు. ఏకంగా డబ్బులు ఇవ్వలేదు అన్న కారణంతో స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన బీహార్లోని పాట్నా జిల్లాలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. పాట్నా జిల్లా పాలి గ్రామానికి చెందిన ప్రదీప్ కుమార్, ప్రిన్స్ కుమార్ లు ఇద్దరు స్నేహితులు. అయితే ఇటీవలి కాలంలో చెడు అలవాట్లకు బానిస గా మారిపోయాడు ప్రిన్స్ కుమార్. ముఖ్యంగా ప్రతిరోజు గంజాయి తీసుకునేవాడు. ఈ క్రమంలోనే ఇక ఇటీవలే గంజాయి కొనుక్కునేందుకు డబ్బులు ఇవ్వాలి అంటూ స్నేహితుడు ప్రదీప్ కుమార్ ని అడిగాడు ప్రిన్స్.



 అయితే అప్పటికే స్నేహితుడు పెడదారిన పడుతున్నాడు అని ఆందోళన చెందిన ప్రదీప్కుమార్ డబ్బులు ఇవ్వను అంటూ చెప్పాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారి తీసింది. ఇక ఆ తర్వాత ప్రిన్స్ కుమార్ ఏకంగా తీవ్ర కోపోద్రిక్తుడిగా మారిపోయాడు. ఇక తన దగ్గర ఉన్న కత్తితో ప్రదీప్ రొమ్ముపై నాలుగైదు సార్లు బలంగా పొడిచాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక గమనించిన స్థానికులు తీవ్ర గాయాలపాలై రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ప్రదీప్ ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రదీప్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక మృత దేహం పోస్టుమార్టం నిమిత్తం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: