కడుపునొప్పితో హాస్పిటల్ వెళ్లిన 8వ తరగతి విద్యార్థి.. అక్కడ షాకింగ్?

praveen
కృష్ణా జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి గత రెండు మూడు రోజుల నుంచి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుంది. ఈ క్రమంలోనే బంధువులు  ఆ బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు.  బాలికకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఊహించని నిజాన్ని బయటపెట్టారు. దీంతో ఆ బాలిక తోపాటు ఇక బంధువులు అందరూ  కూడా ఒక్కసారిగా అవాక్కయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. కడుపునొప్పితో వెళ్ళిన ఆ బాలిక గర్భవతి అన్న విషయాన్ని తేల్చారు వైద్యులు. కృష్ణా జిల్లాలోని కంచికచర్ల లో ఈ ఘటన చోటు చేసుకుంది.




 ఇక ఆ తర్వాతే బాలికను బంధువులు  ప్రయత్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక తల్లిదండ్రులు చిన్న వయసులోనే చనిపోవడంతో అమ్మమ్మ వద్దనే ఉంటూ చదువుకుంటుంది బాలిక. ఇక బాలికకు వెనక ముందు ఎవరూ లేరు అన్న గమనించాడు ఓ కామాంధుడు. ఈ క్రమంలోనే అభం శుభం తెలియని ఎనిమిదో తరగతి బాలికపై లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి శివ అనే యువకుడు భావించాడు. ఈ క్రమంలోనే ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు.  మాయమాటలతో బాలికను లొంగదీసుకున్నాడు. పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు.  ఇటీవలే ఒక్కసారిగా బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది.



 వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాలిక గర్భం దాల్చినట్లు వెల్లడించారు. దీంతో అక్కడున్న బంధువులందరూ షాకయ్యారు ఇక ఆ తర్వాత బాలికను మందలించగా  జరిగిన విషయం చెప్పింది. శివ అనే యువకుడు ప్రేమ పేరుతో తనకు మాయమాటలు చెప్పి పలుమార్లు శారీరక వాంఛలు తీసుకున్నాడు అంటు బంధువులకు తెలిపింది. ఇక బాలిక చెప్పిన వివరాలతో బంధువులు శివ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అంతేకాదు పోక్సో చట్టం కింద అతనిపై కేసు నమోదు చేశారు.  ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: