రెండో పెళ్లి చేసుకుంటే ఈ హక్కు పోయినట్టేనా..?

MOHAN BABU
 మనదేశంలో కూడా మారుతున్న ప్రఖ్యాత సంస్కృతికి అలవాటు పడి  రెండో పెళ్లి కూడా చేసుకుంటున్నారు. ఒకవేళ మొదట చేసుకున్న భర్త నచ్చకపోతే, సదరు భార్య రెండో పెళ్లి చేసుకుంటుంది. అలాగే మొదట చేసుకున్న భార్య నచ్చకపోతే సదరు భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. ఇలా  ఒక్కొక్కరూ ఒకరికి తెలియకుండా ఇంకొకరిని అలా ముగ్గురిని కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చట్టాలను తుంగలో తొక్కి ఇలా పెళ్లిళ్లు చేసుకుని  జైలు పాలైన వారు ఉన్నారు. కానీ ఇప్పటి నుంచి  అలా రెండో పెళ్లి చేసుకున్న వారికి ఆస్తి నుంచి హక్కు  రాదని కోర్టు స్పష్టం చేసింది. అది ఏంటో చూద్దాం..?

 చట్టం పరిధిలో రెండో వివాహం చేసుకున్న వారికి మొదటి భర్త దగ్గర ఉండే ఆస్తి నుంచి హక్కు కోల్పోయినట్లే అని ఛత్తీస్గఢ్ హైకోర్టు  ఇటీవల రుజువు చేసింది. ఇటీవల కాలంలో ఒక కుటుంబం వాళ్ల ఆస్తి పై  తన వదినకు హక్కు లేదంటూ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన తర్వాత హైకోర్టు ఈ విషయాన్ని వెల్లడించింది. గూసి సతీమణి కీయబాయి సంప్రదాయం ప్రకారమే రెండో వివాహం చేసుకుందంటూ వీరు కోర్టులో పిటిషన్ వేశారు.
 కనుక తమ వదినకు అన్నయ్య నుంచి వచ్చే ఆస్తిపై ఎలాంటి హక్కు లేదంటూ ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ లోక్నాథ్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు.  ఈ పిటిషన్ పై  జస్టిస్ కే అగర్వాల్ ఇలా పేర్కొన్నారు. హిందువు రీడో రీ మ్యారేజ్ చట్టం, 1856 లోని సెక్షన్ ఆరు ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకో వడానికి సంబంధించిన వివరాలన్నీ  చూపించా లన్నారు. అలా చేయగలిగితే మాత్రమే సదరు మహిళకు  మొదటి భర్త ద్వారా వచ్చే ఆస్తిపై ఇక హక్కు ఉండదని చెప్పారు.

 పిటిషన్ వేసిన లోకనాథ్ చెప్పిన వివరాల ప్రకారం వారి సాంప్రదాయం ప్రకారం  చూడి సాంప్రదాయంతో గాజులు ఇవ్వడం అనేది పెళ్లి అయిపోయినట్లే అని అన్నాడు. దీనిపై కోర్టు మాత్రం ఇది చట్టపరంగా ఆమోదయోగ్యం కాదని, కీయబాయి మళ్లీ వివాహం చేసుకున్నట్లు  నిరుపించక పోవడంతో పిటిషన్ కొట్టేస్తున్న ట్లు  హైకోర్టు జవాబిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: