
మరి కొన్ని నిమిషాల్లో పెళ్లి.. అంతలో ప్రియురాలు ట్విస్ట్?
కానీ ఈ మధ్య కాలంలో మాత్రం.. ఏం చేస్తాం కలికాలం నిజజీవితంలో కూడా అలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చి అందరికీ షాక్ ఇస్తున్నాయి. ఇక్కడ ఓ యువతి తాను ప్రేమించిన యువకుడిని దక్కించుకోవడానికి ఎంతో ధైర్యం చేసింది. సాధారణంగా అయితే ఇంట్లో వాళ్లకు ఏదైనా చెప్పడానికి భయపడిపోతుంటారు అమ్మాయిలు. కానీ ఇక్కడ ఒక యువతి మాత్రం ఏకంగా పెళ్లి మండపానికి వచ్చేసింది. తాను ప్రేమించిన యువకుడు కి వేరే యువతితో పెళ్లి జరుగుతుంటే సహించలేక పెళ్లి మండపం లోకి ఎంట్రీ ఇచ్చి ఆపండి అంటూ ఒక డైలాగ్ చెప్పేసింది.
ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. సరిగ్గా తాళి కట్టడానికి కొన్ని నిమిషాల ముందు ప్రియురాలు ఇలాంటి పని చేసి అందరికీ షాక్ ఇచ్చింది. తూర్పుగోదావరి జిల్లా మాలకొండ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాజమహేంద్రవరానికి చెందిన మహేష్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో కొన్నేళ్లపాటు ప్రేమలో మునిగి తేలాడు. ఆ తర్వాత పెళ్లికి తన పేరెంట్స్ ఒప్పుకోవడం లేదు అంటూ కారణం చెప్పి తప్పించుకొని తిరగడం మొదలుపెట్టాడు. ఇక ప్రియురాలికి తెలియకుండా మరో మహిళ మెడలో తాళి కట్టేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి ఇక పోలీసులను ఆశ్రయించింది. అంతేకాదు పెళ్లి మండపం లోకి ఎంట్రీ ఇచ్చి పెళ్లి ఆగిపోయేలా చేసింది.