దారుణం.. గర్భిణిని అతి కిరాతకంగా చంపిన భర్త.. చివరికి..

Satvika
ఢిల్లీ అంటే నేరాలకు పెట్టింది పేరుగా మారింది. కను రెప్ప పాటు కాలంలో ఇక్కడ దారుణాలు జరుగుతున్నాయి. ఈ ఘటనలు పై ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా కూడా ఇలాంటి ఘటనలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో దారుణం వెలుగు చూసింది. నిండు గర్భిణి అయిన భార్యను .. అనే భర్త అతి దారుణంగా చంపాడు. ఆ దృశ్యాన్ని సిసిటివి వీడియో ఆధారంగా బయట పడింది.

వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో  గురువారం  ఉదయం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ లో రికార్డు అయ్యాయి. బాధిత మహిళ డ్రగ్ వ్యాపారి అని, ఆమెను చంపింది నాలుగో భర్త అని పోలీసులు తెలిపారు. వివరాలు.. డ్రగ్ క్వీన్‌గా పేరున్న సైనా అనే మహిళ ఢిల్లీలోని హజ్రాత్ నిజమాముద్దీన్ ప్రాంతంలో నివాసం ఉంటుంది. సైనా ఏడాది క్రితం వసీమ్ అనే వ్యక్తిని నాలుగో వివాహం చేసుకుంది.. అయితే అనే డ్రగ్స్ సరఫరా చేస్తున్న కేసు లో పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు కొన్ని నెలలు జైల్లో ఉండి, గర్భవతి కావడం తో బయటకు వచ్చింది.


ఆమె జైల్లో ఉన్న క్రమంలో ఆమె నాలుగో భర్త తన చెల్లితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఆమె రావడం జీర్ణించుకోలేని భర్త ఆమెను చంపే ప్రయత్నం చేశారు.. సైనా ఇంటికి వచ్చిన వసీమ్.. తన వెంట రెండు తుపాకులు తెచ్చుకున్నాడు. ఒక్కసారిగి సైనా పై కాల్పులు జరిపాడు. అయితే సైనా సర్వెంట్ ఆమెను కాపాడే ప్రయత్నం చేయగా, అతని పై కూడా కాల్పుల కు పాల్పడ్డాడు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే సైనా మరణించింది. అనంతరం అతనే పోలీసులకు లొంగిపోయాడు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: