ప్రేమ పెళ్లి.. లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చివరికి ఆ భర్త ఏం చేశాడంటే..?

N.ANJI
గత సంవత్సరం కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం అల్లకల్లోలం చేసింది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది జీవనోపాధిని కోల్పోయారు. ఇక వీరిలో కొందరు ఇతర పనులు చూసుకుని తమ ఆర్థిక ఇబ్బందులను కొంతమేర తగ్గించుకోగలిగారు. కొందరు తాము పని చేసే ప్రాంతాల్లో ఉపాధి లేకపోవడంతో సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. అయితే బెంగళూరుకు చెందిన ఓ యువకుడు మాత్రం ఉద్యోగం పోవడంతో ఎవరూ ఊహించని విధంగా డబ్బు కోసం కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2019లో ప్రేమించిన పెళ్లి చేసుకున్న ఓ జంట బెంగళూరులో నివాసం ఉంటున్నారు. అయితే వారిలో భర్త ఉద్యోగం లాక్‌డౌన్ కారణంగా పోయింది. ఆ తరువాత కొద్దిరోజుల పాటు అతడు ఇతర ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. కానీ అతడి ప్రయత్నాలు ఫలించలేదు. కానీ కొన్ని రోజుల తరువాత అతడికి డబ్బులు రావడం మొదలయ్యాయి.

ఇక అతడికి డబ్బులు మాత్రమే కాదు.. వ్యవహారశైలిలోనూ మార్పు వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన అతడి భార్య.. భర్తలో వచ్చిన ఈ మార్పుకు కారణం ఏంటనే దానిపై ఆరా తీసింది. అతడి ఫోన్ తీసుకుని అందులో ఏమైనా తనకు పనికొచ్చే సమాచారం దొరుకుతుందేమో అని వెతికింది. అయితే అతడి ఫోన్ లాక్ చేసి ఉండటంతో.. తన సోదరుడి సాయంతో ఆ ఫోన్ లాక్ తీయించింది. భర్త ఫోన్‌లోని ఫోటోలు చూసిన భార్యకు మైండ్ బ్లాక్ అయ్యింది. కొందరు మహిళల ఫోటోలు అందులో ఉన్నాయి. ఇక అతడు మగ వేశ్యగా మారాడానే విషయం ఆమెకు అర్థమైంది. మొదట ఈ విషయాన్ని అతడు అంగీకరించలేదు.

చివరికి ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో అతడు వాస్తవం ఒప్పుకున్నాడు. తన భర్తకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం కోసమే తాను ఈ వృత్తిలోకి వచ్చానని అన్నాడు. ఒక్కో కస్టమర్ నుంచి మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు తీసుకుంటానని వెల్లడించాడు. తాను ఈ వృత్తిని మానుకోలేనని.. అయినా భార్యతో కలిసి ఉంటానని అన్నాడు. అయితే ఇందుకు భార్య అంగీకరించకపోవడంతో ఇద్దరు కలిసి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: