పెసల సూప్ ఎప్పుడైనా చేసారా..?
కావాల్సిన పదార్థాలు:
పావు కప్పు- పెసర పప్పు
2కప్పుల - నీళ్ళు
1టేబుల్ స్పూన్- నెయ్యి
1/2టేబుల్ స్పూన్- జీలకర్ర
1/2టేబుల్ స్పూన్ తురిమిన అల్లం
అరకప్పు- క్యారెట్, గుమ్మడికాయ ముక్కలు
కొద్దిగా -మిరియాలు పొడి
చిటికెడు -అల్లం పొడి
చిటికెడు -వాము
కొద్దిగా -ఉప్పు
కొద్దిగా-మెంతి
తయారుచేసే విధానం :
ముందుగా ఒక గిన్నెలో పెసరపప్పుని తీసుకుని ఒకసారి కడిగి కొద్దిగా నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత అందులోని నీటిని తీసివేయాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యిని తీసుకుని వేడి చేయాలి. దానిలో జీలకర్ర, తురిమిన అల్లం వేసి వేపుకోవాలి. ఆ తర్వాత ముందుగా నానపెట్టుకున్న పెసరపప్పుని వేసి కొద్దిగా నీళ్లు పోయాలి . అలాగే క్యారెట్, గుమ్మడి ముక్కలని కూడా అందులో కలుపుకోవాలి.ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఆగాలి. విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ వేడి తగ్గిన.తరువాత మూత తీసి కొద్దిగా వాము, ఉప్పు, మిరియాల పొడి కలుపుకోవాలి.కావాలనుకుంటే మెదుపుకోవచ్చు కూడా. లేదంటే అలానే తాగేయవచ్చు.మొత్తం సూప్ రెడీ అయ్యాక మెంతి పొడిని కొద్దిగా దాని మీద యాడ్ చేయాలి.ఎక్కువ వేస్తే సూప్ చేదుగా ఉంటుంది. అందుకని ఒక చిటికెడు మాత్రమే సూప్ పైన వేసుకోండి. అంతే పెసరపప్పు సూప్ రెడీ అయినట్లే. వేడి వేడిగా సేవించండి.
,