రుచికరమైన మీఠా పారే.. ఈజీగా చేసుకోండి ఇలా...
ముందుగా కావాల్సిన పదార్ధాలు చూసుకున్నట్లైతే...
ప్రధాన పదార్థం..
250 గ్రాములు మైదా,
ప్రధానవంటకానికి...
3 టీ స్పూన్ నెయ్యి,
1/2 కప్ చక్కర,
అవసరాన్ని బట్టి నీళ్ళు తీసుకోవాలి.
తయారు చేయాల్సిన విధానం చూడండి...
ఒక గిన్నెను తీసుకుని, అందులో నీరు, చక్కెర వేసి బాగా కలపండి. చక్కెర పూర్తిగా నీటిలో కరిగేవరకు కలపండి. ఈ మిశ్రమంలో నెయ్యిని వేసి 3 నుండి 4 నిమిషాలపాటు మళ్లీ కలపండి. ఆపై అందులో మైదాని వేసి మెత్తని పిండిగా తయారుచేసుకోండి. ఈ పిండి మెత్తగా మారిన తర్వాత, 1 నుండి ఒకటిన్నర గంటల పాటు పక్కన ఉంచండి. కొంత సమయం తరువాత, రోలింగ్ ప్లేట్ (చపాతీ పీట) మీద పిండిని వేసి, పిండిని చిన్ని చిన్ని భాగాలుగా తయారు చేయండి. రోలింగ్ పిన్కు నూనె రాసి, పిండిని మందంగా ఫ్లాట్బ్రెడ్ లా చేయండి. ఈ ఫ్లాట్ బ్రెడ్ ను మీరు కోరుకున్న ఆకారంలో కట్ చేసి, బంగారు గోధుమ రంగు వచ్చేవరకు పాన్లో వేయించండి. టీ, సాయంత్రం స్నాక్స్ తో ఈ క్రంచీ మీఠా పారేను సర్వ్ చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. ఎవరైనా స్పెషల్ గెస్ట్ లు కాని చుట్టాలు వచ్చినప్పుడు కాని ఈ స్వీట్ అండ్ టేస్టీ రెసిపీ ని కచ్చితంగా తినిపించండి. కచ్చితంగా వారు ఎంతగానో ఈ రెసిపీ ని ఇష్టపడతారు.