మూడో భార్య ఆ కండిషన్ పెట్టడంతో.. కొడుకును చంపిన తండ్రి?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనల గురించి తెలిసిన తర్వాత సభ్య సమాజంలో బ్రతుకుతుంది. మనుషులా లేకపోతే మనుషుల రూపంలో నవ్వుతూ కనిపిస్తున్న మానవ మృగాల అన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పైకి మనిషి నవ్వుతూ కనిపిస్తున్న.. లోలోపలు మాత్రం కుళ్ళు కుతంత్రాలతో మగ్గిపోతున్నాడు అన్నది వెలుగులోకి వచ్చే ఘటనల ద్వారా అందరికీ అర్థమవుతుంది. మొన్నటి వరకు నేను నా వాళ్ళు అనే స్వార్థంతో బ్రతికేవాడు మనిషి. కానీ ఇప్పుడు మాత్రం నేను బాగుంటే చాలు నా వాళ్ళు బాగా లేకపోయినా సరే అని మరింత స్వార్ధాన్ని ప్రదర్శిస్తున్నాడు.

సొంత లాభాల కోసం ఏకంగా రక్తం పంచుకు పుట్టిన వారిని సైతం దారుణంగా హత్య చేసేందుకు సిద్ధపడుతున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటనే జరిగింది. సాధారణంగా తండ్రి అంటే పిల్లలను కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటాడు. ఏ సమస్య వచ్చినా దానిని పరిష్కరిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ తండ్రి మాత్రం ఏకంగా కొడుకు పాలిట కాల యముడిగా  మారిపోయాడు. మూడో భార్య మోజులో పడి కొడుకును దారుణంగా హత్య చేశాడు.

 నాన్న నా ప్రాణాలు ఎందుకు తీస్తున్నావ్ అని ఆ చిన్నారి తండ్రి కళ్ళలోకి దీనంగా చూసిన ఆ కఠినాత్ముడి మనసు మాత్రం కరగలేదు. మధ్యప్రదేశ్లో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇండోర్లో ఉండే శశిపాల్ అనే వ్యక్తి తన ఏడేళ్ల కొడుకు ప్రతిక్ ను దారుణంగా హత్య చేశాడు. నిద్రలో  ఉన్న కొడుకును టీవీ వాల్యూం పెంచి గొంతు నిలిమి చంపేసి అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు శశి పాల్ అతని మూడో భార్య పాయల్ ను అరెస్టు చేశారు. అయితే ఇటీవలే పాయల్ కు మగ బిడ్డ జన్మించాడు. దీంతో ప్రతీక్ ను చంపేస్తేనే ఇంటికి వస్తానని మూడో భార్య కండిషన్ పెట్టడంతో నీచుడు ఇంత దారుణానికి ఒడిగట్టాడు అన్న విషయం పోలీసు విచారణలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: