దారుణం : డబ్బుల కోసం.. చిన్నారిని చంపేసిన యువకుడు?

praveen
నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనల గురించి తెలిసిన తర్వాత సభ్య సమాజంలో బ్రతుకుతుంది నిజంగా మానవత్వం ఉన్న మనుషులేనా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతూ ఉంది అని చెప్పాలి. ఎందుకంటే పరాయి వ్యక్తులకు ఏదైనా ప్రాబ్లం వస్తేనే అయ్యో పాపం అంటూ జాలి పడే మనుషులు.. ఇక ఇప్పుడు సాటి మనుషుల విషయంలో అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు అన్నది వెలుగులోకి వచ్చే ఘటనల ద్వారా తెలుస్తుంది. ఇక సాటి మనుషుల ప్రాణాలను తీయడానికి కూడా వెనకడుగు వేయడం లేదు జనాలు.

 పరాయి వ్యక్తుల విషయంలోనే కాదు సొంత వారి విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తు ఉండటం చూస్తూ ఉన్నాం. ఏకంగా ఆస్తుల విషయంలో సొంత వారిని కూడా హత్య చేసేందుకు వెనకడుగు వేయడం లేదు మనిషి. వెరసి మనిషిలో వచ్చిన మార్పు చూసి సభ్య సమాజంలో బ్రతుకుతున్న  మనుషుల కంటే అడవుల్లో ఉండే క్రూర మృగాలే బెటర్ ఏమో అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. అయితే ఇటీవల హర్యానాలో వెలుగులోకి వచ్చిన ఘటన అయితే ప్రతి ఒక్కరిని మరింత ఉలిక్కిపడేలా చేస్తుంది. ఒక టీనేజర్ డబ్బుల కోసం చిన్నారిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

 సోనీ పట్ లో 8 ఏళ్ల బాలుడిని చంపిన టీనేజ్ యువకుడిని ఇటీవల పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే 8000 చిన్నారి బాలుడు ఉండే ఉండే ప్రాంతంలోనే.. ఆ యువకుడు కూడా ఉంటున్నాడు అన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ముందుగా పక్కా ప్లాన్ ప్రకారం ఆ చిన్నారిని కిడ్నాప్ చేశాడు యువకుడు. ఈ క్రమంలోనే చిన్నారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆరు లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. అయితే ఆరు లక్షలు ఇచ్చుకునే స్తోమత తమకు లేదు అని తల్లిదండ్రులు వేడుకున్నా.. అతను మాత్రం వినలేదు. ఏకంగా ఆ చిన్నారిని దారుణంగా హత్య చేసి ఇక మృతదేహాన్ని సొసైటీ బేస్మెంట్ లో దాచి పరారయ్యాడు. అయితే తల్లిదండ్రులు ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో ఇక అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతను ఇచ్చిన సమాచారంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: