ప్రేమించుకున్న వదిన, మరదలు.. చివరికి ఏం చేశారంటే?

praveen
సాధారణం గా యువతి యువకుల మధ్య ప్రేమ పుట్టడం అనేది సహజం. అది ప్రకృతి ధర్మం కూడా.  ఒక వయసు వచ్చిన తర్వాత యువతి యువకులు ప్రేమ లో పడి ఒకరిని ఒకరు ప్రాణం గా ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే కొంత మంది కేవలం ప్రేమతోనే సరిపెట్టుకుంటే కొంత మంది తమ ప్రేమకు ప్రమోషన్ ఇచ్చి జీవితాంతం కలిసి ఉండడానికి ఇక పెళ్లితో ఒకటవుతూ ఉంటారు.

 ఇక కొంత మంది పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే.. ఇంకొంత మంది పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. అయితే ఇలా యువతి యువకుల ప్రేమ గురించి వదిలేస్తే.. ఇటీవల కాలం లో మాత్రం ప్రకృతికి విరుద్ధం గా ఇద్దరు మహిళలు లేదా ఇద్దరు పురుషులు ప్రేమించుకున్న ఘటనలు వెలుగు లోకి వచ్చి అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి ఘటనలు పోలీస్ స్టేషన్ వరకు వెళుతుండడం తో.. పోలీసులు సైతం షాక్ అవుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో కూడా ఇలాంటి ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది.

 అయితే ఇప్పటి వరకు బావ మరదలు ప్రేమించుకోవడం గురించి విన్నాం. కానీ ఇక్కడ మాత్రం అంత రివర్స్ జరిగింది. ఏకంగా వదిన మరదళ్లు ప్రేమించుకున్నారు. ఇలా కొన్నాళ్ల పాటు ప్రేమ లో మునిగి తేలిన ఇద్దరు యువతులు.. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. బహుజోయి లో ఈ ఘటన జరిగింది. కంపెనీ లో పనిచేసే వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కొద్ది రోజుల పాటు సహ జీవనం కూడా చేశారు.. ఏడు నెలల క్రితం ఇంట్లో నుండి పారిపోయారు. ఇక కుటుంబ సభ్యులు వెతికిన ఆచూకీ లభించలేదు. ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్కు వచ్చిన ఈ ఇద్దరు తాము పెళ్లి చేసుకున్నామని న్యాయం చేయాలంటూ కోరడం తో పోలీసుల సైతం షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: