సీసీటీవీ ఫుటేజ్ చూస్తే గానీ.. ఆ నీచుడి నిర్వాకం బయటపడలేదు?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులు కాదు మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాలు అన్న విషయం అర్థమవుతుంది. ఎందుకంటే అడవుల్లో ఉండే జంతువుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు మనుషులు. సాటి మనుషుల విషయంలో కాస్తయినా జాలీ దయ చూపించకుండా ప్రాణాలు తీస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన అయితే మరింత దారుణం అని చెప్పాలి. పలనాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఇటీవల జంట హత్యలు వెలుగు చూసాయ్.

 ఈ రెండు హత్యలు కూడా సంచలనంగా మారిపోయాయ్. కేవలం 150 రూపాయల కోసం దారుణంగా హత మార్చాడు ఒక నిందితుడు. అయితే ఇటీవల సీసీటీవీ ఫుటేజీ చూసిన తర్వాత నిందితుడు ఎవరు అనే విషయాన్ని నిర్ధారించారు పోలీసులు. సైకోగా భావిస్తున్న వ్యక్తి చేసిన వరుస హత్యలతో.. పట్టణవాసులందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఇలా మృతదేహాల సమాచారం అందుకున్న పోలీసులు మద్యం తాగి కింద పడటంతో మృతి చెంది ఉంటారని తొలుత భావించారు. కానీ తర్వాత సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తే గాని ఒక రాక్షసుడు నిర్వాకం బయటపడలేదు.

 అయితే గంటల వ్యవధిలోని నిందితుడు తన్నీరు అంకమ్మరావుగా గుర్తించారు. వరంగల్ జిల్లా మెహబూబాబాద్ కు చెందిన సంపత్ రెడ్డి ఇంట్లో అలిగి వచ్చి స్థానిక రైల్వే స్టేషన్లో నిద్రించాడు. అయితే అతని వద్ద 30 రూపాయలు తీసుకున్న అంకమ్మరావు బండరాయితో మోది దారుణంగా హతమార్చినట్లు తెలిపారు. తర్వాత కొద్ది దూరంలో ఉన్న మరో వ్యక్తిని 120 రూపాయలు నగదు తీసుకొని అదే రీతిలో బండ రాయితో తలపై హతమార్చాడు. అయితే ఈ రెండు ఘటనల తర్వాత ఈనెల 5వ తేదీన 400 రూపాయల కోసం ఒక యాజకురాలి హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. హత్య చేసింది తన్నీరు అంకమ్మ రావే అన్న విషయాన్ని నిర్ధారించారు పోలీసులు. అయితే గతంలో కూడా పట్టణంలో ఇద్దరిని ఇదే రీతిలో హతమార్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇక అతనిపై 13 చోరీ కేసులు కూడా ఉన్నాయి. గతంలో నగదు కోసం ఒక మహిళను కూడా హతమార్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: