అర్ధరాత్రి స్మశానంలో అమ్మాయి ఏడుపు.. ఏంటా అని వెళ్లి చూస్తే షాక్?
అయితే ఒకవేళ స్మశాన వాటిక నుంచి ఎవరో ఏడుస్తున్నట్లుగా శబ్దాలు వినిపిస్తే ఇంకేముంది ప్రాణాలు గాల్లో కలిసి పోయినంత పని అవుతూ ఉంటుంది. ఇక్కడ కొంత మందికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఊరికి దగ్గరలో ఉన్న స్మశాన వాటిక లో ఎవరో అమ్మాయి గట్టిగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. దీంతో దయ్యం అనుకుని ఒక్కసారిగా జడుసుకున్నారు స్థానికులు. కానీ కాస్త ధైర్యం చేసి ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అని తెలుసుకోవడానికి స్మశానం లోకి వెళ్లారు.
కానీ అక్కడ జరుగుతున్న సీన్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏకంగా స్మశానం లో ఒక అమ్మాయి ఒకచోట కూర్చొని గట్టిగా ఏడుస్తుంది. ఈ ఘటన ఎక్కడో కాదు హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట స్మశాన వాటికలో జరిగింది. తాను ప్రేమించిన అబ్బాయి వదిలేసాడని అతను లేని జీవితాన్ని ఊహించుకోలేను అంటూ అర్ధరాత్రి సమయంలో స్మశానంలో వీరంగం సృష్టించింది యువతి. ఆత్మహత్య చేసుకుంటానంటూ ఏడుస్తూ హల్చల్ చేస్తుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక వారు ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ఇక యువతిని వారికి అప్పగించినట్లు తెలుస్తోంది.