మద్యం మత్తులో తోటి ప్రయాణికుడిపై మూత్రం పోసాడు.. చివరికి?

praveen
ఇటీవల కాలం లో విమానం లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తోటి ప్రయాణికుల తో లేదా విమాన సిబ్బంది తో అనుచితంగా ప్రవర్తిస్తున్న ఘటనలు రోజు రోజుకు ఎక్కువై పోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇలా అనుచితం గా ప్రవర్తించిన వారిని శిక్షించేందుకు అటు కఠినమైన రూల్స్  తీసుకొచ్చిన.. ఎక్కడ ప్రయాణికుల లో మార్పు మాత్రం రావడం లేదు. ఇప్పటివరకు ఏకంగా తోటి ప్రయాణికుల పై కొంత మంది దాడులకు పాల్పడిన ఘటనలు వెలుగు లోకి వచ్చాయి.

 ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారి పోయాయి. కేవలం మిగతా ప్రయాణికుల తో మాత్రమే కాకుండా కొన్ని కొన్ని సార్లు ఇక విమాన సిబ్బంది తో కూడా ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు జరిగాయి. గతంలో అయితే ఒక ప్రయాణికుడు ఏకంగా మరో ప్రయాణికుడిపై మూత్రం పోసిన ఘటన అయితే మరింత సంచలనంగా మారిపోయింది. అయితే ఈ ఘటన గురించి మరవకముందు ఇక ఇప్పుడు ఇలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న ఒక ప్రయాణికుడు తోటి ప్రయాణికుడి పై యూరిన్ పోసిన ఘటన సంచలనంగా మారిపోయింది. అయితే ఈ ఘటన మన దేశంలో కాదు న్యూయార్క్ లో వెలుగులోకి వచ్చింది.

 న్యూయార్క్ ఢిల్లీ అమెరికన్ ఎయిర్లైన్స్ అయిన ఏఏ 252 విమానం లో ఈ ఘటన జరిగింది.  తోటి ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగిన నిందితుడు.. ఇక ఇలా మద్యం మత్తులో ఆ ప్రయాణికుడి పై మూత్రం పోశాడు అన్నది తెలుస్తుంది. ఈ విషయాన్ని గమనించిన విమాన సిబ్బంది అతన్ని మందలించారు. అయితే ఇక ఢిల్లీలో విమానం ల్యాండ్ కాగానే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన ప్రయాణికుడిని చివరికి జైలుకు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: