దోమలను చంపే ఆలౌట్.. బాలుడి ప్రాణం తీసింది?

praveen
ఇటీవల కాలంలో మరణం ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలా సంభవిస్తుంది అన్నది ఊహకమైన విధంగానే ఉంది అన్న విషయం తెలిసిందే. అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని ఘటనలు చివరికి ప్రాణాలను తీసేస్తున్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా ఇక ఇలాంటి ఘటనల కారణంగా ఎంతో మంది అభం శుభం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. సాధారణంగా అయితే చిన్నారులు తెలిసి తెలియని వయసులో ఏదో ఒకటి అల్లరి చేస్తూ ఉంటారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే చిన్నారులు ఇలా అల్లరి చేస్తున్న సమయంలో ఎప్పుడు తల్లిదండ్రులు వారిని ఒక కంట కనిపెట్టుకొని ఉండాలని సూచిస్తూ ఉంటారు నిపుణులు.  అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం ఇలా తల్లిదండ్రులు ఏమరు పాటుగా ఉండడంతో చివరికి చిన్నారుల ప్రాణాలు పోయే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇటీవల హైదరాబాద్ నగరంలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది. మస్కిటో కాయిల్ చిన్నారి ప్రాణం తీసింది. తారా నగర్కు చెందిన జుబేర్ కొడుకు అబ్బు జాకీర్ ఆడుకుంటూ మస్కిట్ కిల్లర్ ఆల్ అవుట్ లిక్విడ్ ను తాగాడు.

 అయితే తర్వాత గుక్క పెట్టి ఏడవడం మొదలు పెట్టాడు. ఇక బాలుడి బట్టల పై ఆల్ అవుట్ వాసన రావడం తో అనుమానం వచ్చిన తల్లి దండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరికి బాలుడు మృత్యువాత పడ్డాడు అని చెప్పాలి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మరణం వెనుక మరో కోణం ఏమైనా ఉందా అనే విషయంపై కూడా ఇక విచారణ చేస్తున్నారు అని చెప్పాలి. ప్రాథమికంగా అయితే బాలుడు అనుకోకుండా లిక్విడ్ తాగడం కారణంగానే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: